నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై చిత్రం టీజర్ విడుదలయ్యింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే కోణంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. స్పై చిత్రం నేపథ్యంలో మరోసారి నేతాజీ డెత్ మిస్టరీ వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
కార్తికేయ-2 చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు హీరో నిఖిల్. ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడమే కాక.. మంచి కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ-2 భారీ విజయం తర్వాత స్పై అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నిఖిల్. భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు.. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు.. ప్రజల చేత నేతాజీగా పిలిపించుకున్న సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని చేధించే కథాంశంతో తెరకెక్కుతున్న ఈచిత్రం జూన్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన టీజర్.. సినిమా మీద అంచనాలు పెంచడమే కాక.. మరోసారి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని తెర మీదకు తీసుకువచ్చింది. అసలు నేతాజీ ఎలా మృతి చెందారు. ఆయన మరణం ఇంత మిస్టరీగా ఎందుకు మారిందో తెలియాలంటే.
సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. హింసా పద్దతిలోనే బ్రిటీషర్లతో పోరాటం చేయాలని భావించి.. ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు. స్వాతంత్య్రం కోసం తన జీవితా కాలం కృషి చేసిన నేతాజీ.. భారతవనికి స్వేచ్ఛ లభించడానికి రెండేళ్ల ముందు విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఇక నాటి నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆయన మృతి చెంది ఇప్పటికి 78 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ మృతి మాత్రం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది.
నేతాజీ మృతిపై గతంలో వేసిన జస్టిస్ ముఖర్జీతో ఏకసభ్య విచారణ కమిటీ 2005లో ఓ నివేదిక సమర్పించింది. అందులో కూడా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. అంతేకాక తాజాగా నేతాజీ మనవళ్లు మనవరాండ్రు మాత్రం తమ తాతయ్య విమాన ప్రమాదంలోనే మృతి చెందారంటూ చెప్పుకొచ్చారు. అయితే నేతాజీ మాత్రం ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్లో గుమ్నామీ బాబాగా బతికే ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. 1960వ దశకం నుంచి 1987వ దశకం వరకు సుభాష్ చంద్రబోస్ గుమ్నామీ బాబా అవతారంలో జీవించి ఉండేవాడని అతని కింద పలువురు శిష్యులు కూడా ఉండేవారిని వార్తలు వచ్చాయి. మరి ఇవి వాస్తవమో కాదో తెలియదు.
1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. ఐతే.. జస్టిస్ ఏంకే ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని తెలిపింది. ఇంతకు.. నేతాజీ మరణం ఎప్పుడు సంభవించింది.. గుమ్నామీ బాబా -నేతాజీ ఒక్కరేనా.. రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా.. కావా.. అనే అనుమానాలు అలానే ఉన్నాయి. పైగా నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందారు అని చెబుతుండగా.. కొందరు మాత్రం అలాంటి ప్రమాదమే జరగలేదని అంటున్నారు. అయితే వీటిపై అప్పటి ప్రభుత్వాలు సరైన పద్దతిలో విచారించలేదు.
దీనిపై అప్పటి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదు.. వాస్తవాలు వెలికితీసే ప్రయత్నాలు చేయలేదు. ఒకవేళ చేసినా.. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయో, రాలేదో తెలియదు. కానీ.. నేతాజీ మృతి మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది. మరి అలాంటి అంశం మీద స్పై సినిమా తెరకెక్కుతుంది. టీజర్లో చెప్పినట్లు.. నిజంగానే నేతిజీ విమాన ప్రమాదంలో మృతి చెందారు అనేది కవరప్ స్టోరీనా.. మరి సినిమాలో అసలు వాస్తవాలు చూపించే ప్రయత్నం చేశారా లేదా అన్నది తెలియాలంటే.. సినిమా విడుదలయ్యేవరకు ఎదురు చూడాలి. స్పై సినిమా వల్ల మరోసారి నేతాజీ మృతి మిస్టరీ తెర మీదకు వచ్చింది.