రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడకు హనుమంతుడు వస్తారని చెబుతారు. అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా చూసేందుకు సాక్షాత్తు హనుమంతుల వారే థియేటర్ కి వచ్చారని నెటిజన్లు ఓ వీడియోని షేర్ చేస్తున్నారు.
2023 జూన్ 16 చరిత్రలో ఒక గొప్ప తేదీగా ఉండిపోయే రోజు. ఎందుకంటే ఇవాళ హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముని కథతో సినిమా విడుదలైన రోజు కాబట్టి. మన తెలుగు హీరో ప్రభాస్ నటించిన సినిమా కాబట్టి. ఫలితంతో సంబంధం లేకుండా ఈరోజు హిందువులు, ప్రభాస్ ఫ్యాన్స్ కలిసి చేసుకునే పండగ కాబట్టి. ఆదిపురుష్ సినిమా విడుదలవడంతో ఎక్కడ చూసినా ఈ సినిమా హవానే నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా, ప్రపంచమంతటా జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. అయితే చిత్ర దర్శకుడు ఓం రౌత్ చెప్పినట్టు.. సినిమా చూడడానికి సాక్షాత్తు ఆ హనుమంతుడే థియేటర్ కి వచ్చారా అని అనిపిస్తుంది.
ఎందుకంటే రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడకు హనుమంతుడు వస్తాడని మన పెద్దలు చెబుతారు. దర్శకుడు కూడా హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఆదిపురుష్ సినిమా ప్రదర్శన జరుగుతున్న ప్రతీ థియేటర్ లో ప్రతి రోజూ ఒక సీటుని హనుమంతుడి కోసం కేటాయించారు. మరి హనుమంతుడే ఆ వానర రూపంలో వచ్చారా అన్న సందేహం కలుగుతుంది. ఆదిపురుష్ సినిమా ఆడుతున్న థియేటర్ లోకి ఒక మారుతి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ అందరితో కలిసి సినిమా చూస్తుంది. ఆ సమయంలో ప్రభాస్ రాముడి వేషంలో ఒక డైలాగ్ చెప్తున్నారు. ‘శత్రువుని చంపితే శత్రుత్వం చావదు. క్షమించి చూద్దాం’ అని చెప్పే డైలాగ్ కి ప్రేక్షకులు, ఫ్యాన్స్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.
మారుతి మాత్రం చాలా ఆసక్తిగా ప్రభాస్ ని చూస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. హనుమాన్ సినిమా చూస్తున్నారని ఒకరు, ఇన్ని రోజులూ దేవుడు ఉన్నాడా అని చిన్న అనుమానం ఉండేది, ఈ వీడియో చూశాక దేవుడు ఉన్నాడని అర్థమైంది. జై హనుమాన్ అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. మరి ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
Hanuman Ji watching #Adipurush 💥💥💥 #JaiShriRam #Prabhas pic.twitter.com/cKSA52g792
— Prasad Bhimanadham (@Prasad_Darling) June 16, 2023