Khushbu: తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కొంతకాలానికి ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రారంభించారు నిర్వాహకులు. ఇక జబర్దస్త్ కి యాంకర్ గా అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ గౌతమ్ ని సెట్ చేసేశారు. అప్పటినుండి ఈ రెండు షోలు సాఫీగా సాగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కొంతకాలంగా జడ్జిలు, కంటెస్టెంట్స్ లో మార్పులు జరుగుతున్న విషయం విదితమే. మొదట జడ్జిలుగా ఉన్నటువంటి నాగబాబు, రోజా వెళ్లిపోయాక.. సింగర్ మనో, నటి ఇంద్రజ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అదీగాక ఈ మధ్యలో చాలామంది సీనియర్ నటులు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిలుగా వచ్చి వెళ్తూ ఉండటం మనం గమనించవచ్చు.
ఇదిలా ఉండగా.. తాజాగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ లోకి జడ్జిగా మరో కొత్త సెలబ్రిటీ విచ్చేసినట్లు తెలుస్తుంది. తాజా ప్రోమో చూసినట్లయితే.. ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జి ఇంద్రజతో పాటు కొత్తగా సీనియర్ నటి ఖుష్బూ కనిపించడం విశేషం. ఇక వచ్చీ రావడంతో కమెడియన్స్ చేసే స్కిట్స్ పై తనశైలిలో పంచులు వేసే ప్రయత్నం చేసింది. అలాగే.. యాంకర్ రష్మీ, ఇంద్రజలతో కలిసి ఎంట్రీ సాంగ్ డ్యాన్స్ చేయడం కూడా ఆకట్టుకుంటోంది. మరి ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జిగా ఖుష్బూ రాకపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.