Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఆగస్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పటికే బింబిసార నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ అన్నీకూడా నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ చూస్తే.. విజువల్ ఫీస్ట్ లాగా రూపొందించారు. ట్రైలర్ లో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ విశ్వరూపం చూడబోతున్నారు ఫ్యాన్స్. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలు, పవర్ పుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ చెప్పాడు. “బింబిసార మూడు నాలుగు పార్ట్స్ ఉండబోతుందని అంటున్నారు కదా.. ఇందులో మిమ్మల్ని, ఎన్టీఆర్ ని కలిపి చూడవచ్చా?” అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘అన్నీ కుదిరితే నన్ను, తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ పై చూస్తారు. ప్లాన్ జరుగుతోందంటూ సర్ప్రైజ్ చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కళ్యాణ్ రామ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.