ఈ మధ్యకాలంలో సినిమాలనేవి జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకు ఉదాహరణగా లేటెస్ట్ పుష్ప సినిమా నిలుస్తోంది. ఓ రీజనల్ మూవీగా మొదలైన ఈ సినిమా.. మేకింగ్ ప్రాసెస్ లో పాన్ ఇండియా స్థాయి సినిమా అయింది. తీరా పాన్ ఇండియా వైడ్ విడుదలయ్యాక పుష్ప రేంజే మారిపోయింది. ప్రస్తుతం పుష్ప ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు మేనరిజం, డైలాగ్ డెలివరీకి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ డైలాగ్స్, ఆటిట్యూడ్, డాన్స్ లతో రీల్స్ కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీల నుండి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు బన్నీ(పుష్పరాజ్)ని అనుకరిస్తూ రీల్స్, వీడియోలు చేసేసరికి పుష్ప పై ఉన్న పాన్ ఇండియా క్రేజ్ కాస్తా ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. మరి ఎలాగో పుష్పకి ఇంటర్నేషనల్ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయింది.. కాబట్టి మేకర్స్ ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని పుష్ప సీక్వెల్(పుష్ప 2)ని పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పుష్ప బృందం స్టోరీ డిస్కషన్స్ తో పాటు పాన్ వరల్డ్ క్రేజ్ పై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పుష్పకి ఉన్న హైప్ దృష్ట్యా సీక్వెల్ రిలీజైతే.. అది ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో ఊహకు కూడా అందడం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పుష్ప మూవీకి ఇంటర్నేషనల్ రేంజి రావడానికి సాంగ్స్ కూడా కారణం. శ్రీవల్లి, ఊ అంటావా, సామీ, ఏ బిడ్డా.. ఇలా పుష్ప సాంగ్స్ అన్నీ ప్రేక్షకులలో అంచనాలు రెట్టింపు చేశాయి. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప పాన్ వరల్డ్ క్రేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.