Nitin: టాలీవుడ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో నితిన్, జేపీ నడ్డా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నితిన్తో పాటు పలువురు రచయితలు, క్రీడాకారులు కూడా జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. రేపు హన్మకొండలో జరగబోయే సభలో పాల్గొనేందుకు నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్తో ఆయన భేటీ కానున్నారట. ఇక, బీజేపీ టాలీవుడ్ హీరోలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. అరగంటకుపైగా ఇద్దరూ మాట్లాడుకున్నారు.
అది రాజకీయ భేటి కాదని, ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు సంబంధించి ఎన్టీఆర్ను ప్రశంసించానని అమిత్షా అన్నారు. అయినప్పటికి వారి భేటీ రాజకీయపరమైనదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు నడ్డా, నితిన్తో భేటీ కావటం చూస్తుంటే.. బీజేపీ టాలీవుడ్ హీరోల క్రేజ్ను రాజకీయాలకు వాడుకోవటానికి చూస్తున్నట్లుగా ఉంది. కాగా, హీరో నితిన్ తాజాగా, మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరి, టాలీవుడ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Gajuwaka Lady Conductor: 3 నెలలు గంజి అన్నం, ఆవకాయ తిని బతికాను : గాజువాక లేడీ కండెక్టర్