తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన సమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు ప్రభావం ఈ రెండు సినిమాల పై బాగానే పడింది.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతోనే కాకుండా జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. సాధారణంగా ఏ సినిమా అయినా ఫ్లాప్ టాక్ వచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో మునిగిపోతే హీరోలు వారికి అండగా నిలబడి తమవంతు సాయం చేస్తుంటారు. పవన్ కళ్యాన్ సైతం గతంలో జానీ, కొమురం పులి మూవీస్ విషయంలో నిర్మాతలకు అండగా నిలిచారు. ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీస్ విషయంలో నష్టపోయిన వారికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి రథంతో జనంలోకి వచ్చారు.. ఇటీవల ప్రారంభించిన యాత్రకు ప్రజలు, అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.. పవన్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం కమిట్ అయిన మూవీస్ కంప్లీట్ చేయడం, లైనప్ చేసిన సినిమాల నుండి కాస్త విరామం తీసుకోవడం చేస్తున్న పీకే.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీని షూటింగుని కేవలం మూడు వారాల్లోనే పూర్తి చేసేశారు.. దీనికి పారితోషికంగా రోజుకి రూ.2 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు స్వయంగా జనసేనానే చెప్పారు.. ‘వకీల్ సాబ్’ తర్వాత వరుసగా క్రేజీ సినిమాలు పట్టాలెక్కించిన పవన్.. ‘హరిహర వీరమల్లు’ తో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో, భారీ బడ్జెట్తో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది..
తర్వాత ‘గబ్బర్ సింగ్’ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితోనూ ఓ సినిమా అనౌన్స్ చేశారు.. ఇంతలో ‘సాహో’ సుజిత్ ‘ఓజీ’ మొదలైపోయింది.. హరీష్ శంకర్ సినిమా కూడా కొంత వరకు షూట్ జరుపుకుందని తెలుస్తుంది.. ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటి ఏడాది పైగానే అవుతుంది.. ఇంత వరకు మరే సినిమా విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు కానీ మరో నెల రోజుల్లోనే వారి ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడబోతుంది.. ‘బ్రో’ జూలై 28న రిలీజ్ అని కన్ఫమ్ చేసిన టీం.. లాక్ చేసిన డేట్ని రీచ్ అవడానికి ఫుల్ స్వింగ్లో వర్క్ చేస్తున్నారు.. కొద్ది రోజుల్లో టీజర్, ట్రైలర్తో ప్రేక్షకాభిమానులను ఖుషీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..
ఇదిలా ఉంటే.. రాజకీయాలకు సంబంధించిన పలు ప్రెస్మీట్లలో పవన్.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ గురించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ.. ‘ఇటీవల తాను నటించిన సినిమాల విడుదల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఆ రెండు సినిమాల నష్టాలను తాను భరించానని చెప్పుకొచ్చారు పవర్ స్టార్.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అప్పుడు ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గించారు.. టికెట్ రేట్ కేవలం 10 రూపాయలు పెడితే పెట్టుబడి ఎప్పటికి తిరిగొస్తుంది?.. ఆ రెండు సినిమాలూ హిట్ కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మాతలకు నష్టం వచ్చింది.. దీంతో రూ.30 కోట్ల భారం నేనే భరించాను’’ అన్నారు పవన్ కళ్యాణ్.. దీంతో ఆయన రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..