బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయవాడకు చెందిన ఈ బ్యూటీ… టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది. అలా వచ్చిన గుర్తింపు ద్వారా.. యాంకర్గా అవకాశం రావడంతో.. తనను తాను నిరూపించుకుంది. ప్రస్తుతం బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్గా రాణించడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది దీపికా పిల్లి. డ్యాన్స్, కామెడీ షోలకు యాంకర్గా చేసిన దీపికా పిల్లి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ.. వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఇక అక్కడి నేచర్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దగ్గర టాలీవుడ్ టూ బాలీవుడ్ బ్యూటీలు వెకేషన్ కోసం వెళ్లాలనుకుంటే.. ఫస్ట్ వారికి గుర్తుకు వచ్చే ప్రదేశం.. మాల్దీవులు. టీవీ నుంచి సినిమా వరకు సెలబ్రిటీలందరూ మాల్దీవులకు వెళ్లి.. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ.. హాట్, క్యూట్ పోజులిస్తూ.. ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం దీపికా పిల్లి కూడా మాల్దీవుల్లో ఇలానే ఎంజాయ్ చేస్తుంది. ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ.. చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి.
వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు షేర్ చేస్తూ.. నెటిజన్లకు ఐఫీస్ట్ కలిగిస్తోంది. మాల్దీవుల్లో ఈ భామ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. గ్లామర్ విందులో హద్దులు దాటేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ.. తన గ్లామర్తో నెటిజనులకు కనువిందు చేస్తోంది. పొట్టి డ్రెసులు, స్విమ్ సూట్లలో దర్శనమిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. తాజాగా దీపికా పిల్లి పంచుకున్న ఫొటోలు కూడా స్టన్నింగ్గా ఉన్నాయి. పసుపు రంగు మినీ డ్రెస్లో.. బీచ్లో కూర్చుని.. ఇసుకుతో ఆడుకుంటూ.. ఎంజాయ్ చేస్తోంది దీపికా పిల్లి. మతులు పోగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతన్నాయి.
ఇక దీపికా పిల్లి కేరీర్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. పలు షోలు, కార్యక్రమాలతో యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’కు యాంకర్గా చేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ షోకు యాంకర్గా కొనసాగుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈషోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.