Promo: తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోకి కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త ప్రోగ్రామ్స్ తో పాటు టాలెంట్ ఉండి ప్రోత్సాహం లేనివాళ్లను ఈ స్టేజి ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. సినీనటి పూర్ణ జడ్జిగా కనిపించిన ఈ ప్రోమోలో ‘పెళ్ళాం చెబితే వినాలి’ అనే కొత్త థీమ్ తో ఎంటర్టైన్ చేశారు కమెడియన్స్. అయితే.. ఈ ప్రోమోలో హైపర్ ఆదితో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు జంటగా వచ్చి సందడి చేశారు.
ఈ క్రమంలో స్టేజిపై ఏర్పాటు చేసిన కబడ్డీ ఆటలో.. బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా పాల్గొన్నారు. అయితే.. అప్పటివరకూ ఎంతో హుషారుగా యాంకర్ రష్మీపై పంచులు వేసిన ఆయన.. కబడ్డీలో కూతకు వెళ్లి స్టేజిపైనే కుప్పకూలడం అందరినీ టెన్షన్ కి గురిచేసింది. అసలు ఏం జరిగిందనేది ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాలి. ప్రస్తుతం భాస్కర్ తండ్రి స్టేజిపై పడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.