సినీ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. సినీ సెలబ్రిటీలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్, ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్స్. ఏదైనా వేడుక అయినా, లేదా షాప్ ఓపెనింగ్ అయినా.. వీరిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. ఈ క్రమంలో వారిని తాకేందుకు ప్రయత్నిస్తూ వెకిలీ పనులకు తెర లేపుతున్నారు కొందరు.
సినీ ప్రముఖులపై దాడులు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. సినీ సెలబ్రిటీలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్, ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్స్. ఏదైనా వేడుక అయినా, లేదా షాప్ ఓపెనింగ్ అయినా.. వీరిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. ఈ క్రమంలో వారిని తాకేందుకు ప్రయత్నిస్తూ వెకిలీ పనులకు తెర లేపుతున్నారు కొందరు. ఇటీవల అపర్ణా బాల మురళీకి అటువంటి చేదు అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. ఓ కాలేజీలో ఆమెతో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు.. ఆమె మీద చేతులు వేసేందుకు ప్రయత్నించగా.. ఆమె ఇబ్బంది పడ్డారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న ఓ నటిని ఫాలో అవుతూ ఓ వ్యక్తి వేధించాడు. కాగా, ఇప్పుడు ఓ ఫిమేల్ సింగర్కు చేదు అనుభవం ఎదురైంది.
ప్రముఖ భోజ్ పురి ఫోక్ సింగర్ నిషా ఉపాధ్యాయకు తృటిలో ప్రాణ పాయం తప్పింది. బీహార్ లోని పాట్నాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో లైవ్ ఫెర్మామెన్స్ ఇస్తుండగా.. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఆమెకు బుల్లెట్ గాయాలయ్యినట్లు తెలుస్తోంది. నిషా ఎడమ తొడకు బుల్లెట్ తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పాట్నాలోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమకు సమాచారం అందిందీ కానీ, రాత పూర్వకమైన ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎలా తుపాకీ కాల్పులు జరిగాయి, ఎవరు కాల్చారు, ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిషా ఉపాధ్యాయ బీహార్కు చెందిన ప్రముఖ గాయని. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్ మరియు హసి హసి జాన్ మారెలా వంటి సాంగ్స్ ఫేమస్ అయ్యాయి. ఆమె తరచుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది.