నటసింహం బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. అఖండ తర్వాత వీరసింహరెడ్డితో బాక్సాఫీస్ వేటకు సిద్ధమైపోయాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని రూపొందించాడు. పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వీరసింహారెడ్డి సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలయ్య డైలాగ్స్.. డాన్స్.. మాస్ యాక్షన్ సీక్వెన్సులు.. ఫైట్స్.. ఎమోషన్స్.. ఇలా ఫ్యాన్స్ కి ఏమేం కావాలో అన్ని మాస్ అంశాలను చేర్చి వీరసింహారెడ్డి ట్రైలర్ ని కట్ చేశారు.
బాలయ్య లుంగీ కట్టి.. మాస్ లుక్కులో ఒక్కో డైలాగ్ చెబుతుంటే.. ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పూనకాలు రావడం గ్యారంటీ అని చెప్పాలి. ఈసారి బాలయ్య మాసిజంకి మరింత బేస్ యాడ్ చేసి.. స్క్రిప్ట్ ని ఎలివేట్ చేస్తూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడేమో అనిపిస్తోంది. ట్రైలర్ ని చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో షార్ప్ గా కట్ చేశారు. అయితే.. ఇప్పుడు ట్రైలర్ లో బాలయ్య కొట్టిన ఓ డైలాగ్.. ఏపీ గవర్నమెంట్ వైసీపీపై సెటైరికల్ ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, ఆ చరిత్రని సృష్టించినవారి పేరు మారదు.. మార్చలేరు” అని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది.
ఇప్పుడా డైలాగ్ ని వైసీపీకి సెటైరికల్ గా వేశారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినందుకు ఏ స్థాయిలో జనాలు రియాక్ట్ అయ్యారో తెలిసిందే. ఇప్పుడు అదే విషయంపై ఇండైరెక్ట్ గా కౌంటర్ వేశారని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుందో తెలియదు. కానీ.. ప్రస్తుతం అయితే ట్రైలర్ లో డైలాగ్ ని.. ఇలా హెల్త్ యూనివర్సిటీ విషయాన్నీ జోడించి ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మరి ఈ డైలాగ్ విషయం ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మరి వీరసింహారెడ్డి ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.