ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం చేయాలని ఎంతోమందికి కల ఉంటుంది. మీరు కూడా పోలీస్ అవ్వాలని కలలు కంటున్నారా? పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీ కల, ప్రయత్నం ఫలించే అవకాశం వచ్చింది. పదో తరగతి అర్హతతో నెలకి 20 వేల నుంచి 40 వేల వరకూ జీతంతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. త్రిపుర పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, జీతం ఎంత ఇస్తారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.