సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. బ్యాటింగ్కు సహకరించే పిచ్పై ఇరు టీమ్స్ ప్లేయర్లు చెలరేగి ఆడారు. దీంతో ఐపీఎల్లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బంపర్ విక్టరీ కొట్టింది. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (11) ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించారు. అయితే వీళ్లిద్దరూ తక్కువ వ్యవధిలోనే ఔటవ్వడం, పవర్ప్లేలో రన్స్ పెద్దగా రాకపోవడంతో ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (18) అండగా నిలవడంతో స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (104) సెంచరీతో చెలరేగి ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్గా చేసుకొని సిక్సుల వర్షం కురిపించాడు క్లాసెన్. చివర్లో హ్యారీ బ్రూక్ (27) కూడా బ్యాట్ ఝళిపించడంతో ఎస్ఆర్హెచ్ 186 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి సూపర్ స్టార్ట్ లభించింది.
సన్రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ వరుస ఫోర్లతో అలరించాడు. నటరాజన్, కార్తీక్ త్యాగి, అభిషేక్ శర్మ బౌలింగ్లో కూడా ఫోర్లు, సిక్సులతో భారీగా రన్స్ పిండుకున్నారు కోహ్లీ-డుప్లెసిస్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్ను పట్టుకోవడంలో ఫిలిప్స్ ఫెయిలయ్యాడు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోహ్లీ-డుప్లెసిస్ జోడీ తొలి వికెట్కు ఏకంగా 172 రన్స్ జోడించింది. విరాట్ సిక్సర్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బాల్కే భువీ బౌలింగ్లో ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్ (71) కూడా పెవిలియన్ చేరాడు. వీళ్లిద్దరూ వెనుదిరిగినా మైకేల్ బ్రేస్వెల్ (4), గ్లెన్ మ్యాక్స్వెల్ (5) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.
సన్రైజర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ నెగ్గినప్పటికీ ఎస్ఆర్హెచ్ కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఆ టీమ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. క్లాస్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు క్లాసెన్. ఈ గేమ్లో ఇరు జట్ల నుంచి ఒక్కో సెంచరీ నమోదైంది. ఆర్సీబీలో కోహ్లీ, ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ సెంచరీలతో చెలరేగారు. ఒక మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదవ్వడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఐపీఎల్లో రెండు సార్లు ఇలా రెండు సెంచరీలు నమోదయ్యాయి. కోహ్లీ, ఏబీ డివిలియర్స్లు 2016లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ మ్యాచ్లో సెంచరీలతో చెలరేగారు. 2019లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టోలు సెంచరీలు బాదారు. అయితే ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఇరు టీమ్స్ నుంచి ఒక్కో ప్లేయర్ సెంచరీ నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇదో అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు.
The both centurions of the night – Virat Kohli and Heinrich Klaasen appreciated each other.
– First time in history both teams registered an individual century in an IPL match! pic.twitter.com/CHsCmUHOFK
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2023