శివమ్ దూబే.. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్లో శివతాండవం ఆడాడు. గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో నాలుగు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు ఐపీఎల్ 2022లో తొలి విజయం దక్కింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 36 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే 10వ ఓవర్ వరకు ఆచితూచి ఆడారు. 10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 60 పరుగులు మాత్రమే చేసింది.
ఇక 11వ ఓవర్ నుంచి దూబే ఊచకోత మొదలెట్టాడు. ఊతప్ప కూడా గేర్ మార్చాడు. ముఖ్యంగా దూబే భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ హెజల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా 103 మీటర్ల భారీ సిక్సు కొట్టాడు దూబే. ఆ బంతి వెళ్లి స్టేడియం రూమ్స్లో పడింది. దూబే దెబ్బకు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇలాంటి షాట్లతో చెన్నై స్కోర్ను 20వ ఓవర్ ముగిసే సరికి 215 పరుగులకు చేర్చాడు. చివరి ఓవర్ చివరి బంతికి.. దూబే సిక్స్ కొట్టి ఉంటే.. సెంచరీ పూర్తి చేసుకునే వాడు. ఆ ఛాన్స్ కొద్దిలో మిస్ అయింది.దీంతో దూబే.. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 95 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప(50 బంతుల్లో 88) భారీ ఇన్నింగ్స్లతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. అలాగే లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చెన్నై బౌలర్లు జడేజా, తీక్షణ చెలరేగడంతో 23 పరుగుల తేడా సీఎస్కే విజయం సాధించింది. మరి అద్దాలు బద్దలయ్యేలా భారీ సిక్సులతో శివమెత్తిన దూబే ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాయుడులో బయటపడిన కొత్త డైమెన్షన్! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్
— Sayyad Nag Pasha (@PashaNag) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.