విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ను ఫైనల్ చేర్చాడు. మంగళవారం కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోసి తమ జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 68 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్కు అద్భుత విజయం అందించాడు. మిల్లర్ ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అందుకు కారణం.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ మిల్లర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. దీంతో మిల్లర్ భారీ ధరకు అమ్ముడుపోతాడని చాలా మంది భావించారు.
కానీ.. ఆశ్యర్యకరంగా మిల్లర్ పేరు వేలానికి వస్తే.. కనీసం ఒక్క ఫ్రాంచైజ్ కూడా స్పందించలేదు. దీంతో అతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. మిల్లర్పై ఏ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది. గతంలో పంజాబ్కు ఆడిన మిల్లర్ చాలా మంచి మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. అయినా కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. అమ్ముడుపోని ఆటగాళ్లను తిరిగి రెండు రౌండ్లో వేలంలో ఉంచగా.. అప్పుడు గుజరాత్ టైటాన్స్.. రూ.3 కోట్లకు మిల్లర్ను దక్కించుకుంది. నిజానికి మిల్లర్కు ఇంకా మంచి ధర పలకాల్సింది. అతని స్థాయి, సామర్థ్యానికి రూ.3 కోట్లు తక్కువే. 2014లో మిల్లర్ తొలి సారి ఐపీఎల్ వేలంలో పాల్గొన్న సమయంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.12.50 కోట్ల భారీ ధర పెట్టి కోనుగోలు చేసింది. 2019 వరకు మిల్లర్ పంజాబ్కే ఆడాడు. 2020లో రాజస్థాన్ మిల్లర్ను రూ.75 లక్షల తక్కువ ధరకు దక్కించుకుంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలి రౌండ్లో తనను ఎవరూ పట్టించుకోకపోవడాన్ని మిల్లర్ అవమానంగా భావించినట్లు సమాచారం. అందుకే తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, పాండ్యా, దయాళ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ను ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే ఫామ్లో ఉన్న సాహాను అవుట్ చేసి దెబ్బతీశాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్, శుభ్మన్ గిల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ.. సమన్వయ లోపంతో గిల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్లో 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కొద్ది సేపటికి వేడ్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి కెప్టెన్ హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ సీజన్తోనే బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే ఫైనల్ చేరి అదరగొట్టింది. మరి ఈ మ్యాచ్లో మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: తనని తాను ఎంఎస్ ధోని అనుకున్న అశ్విన్! పాపం పరాగ్..
David Miller after going unsold in IPL 2022 auction in the first round 😍
Expect the unexpected😎pic.twitter.com/pSgwDwum4S
— CricTracker (@Cricketracker) May 24, 2022