క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఐపీఎల్కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మాదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ను ఏకంగా 1,01,566 మంది ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించారు. ఒక క్రీడను ఇంతమంది స్టేడియంలో వీక్షించడం వరల్డ్ రికార్డ్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించింది.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషాకు రికార్డు పత్రం అందించింది గిన్నిస్ సంస్థ. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. ‘ఇండియా గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఇది ఆటను ప్రేమించే, సపోర్ట్ చేసే అభిమానుల కోసం. మోతేరా క్రికెట్ స్టేడియానికి, ఐపీఎల్కు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. ఈ ట్వీట్ను రిట్వీట్ చేస్తూ.. జైషా కూడా ఒక ట్విట్ చేశాడు. ‘101566 మంది ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి.. గిన్నిస్ రికార్డ్ అందించడంపై చాలా సంతోషంగా ఉంది. 29 మే 2022న అద్భుతమైన నరేంద్రమోదీ స్టేడియం. దీన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు మా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు.
కాగా గతంలో మోతెరా స్టేడియంగా పిలువబడే ఈ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. గతంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోదీ స్టేడియం పలు రికార్డులను సృష్టించింది. భారీ సిట్టింగ్ సామర్థ్యం గల ఈ స్టేడియం.. గతేడాది జరిగిన ఐపీఎల్ 2022 ఫైనల్కు వేదికైంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి.. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ పెద్ద పెద్ద టీమ్స్కు షాకిస్తూ.. వరుస విజయాలతో దూసుకెళ్లింది. ఇక ఫైనల్లోనూ అదే ఆటతీరుతో ఛాంపియన్గా నిలిచింది. ఈ అద్భుత విజయానికి తోడు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఇప్పుడు ఐపీఎల్ సొంతమైంది.
Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera‘s magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCI https://t.co/JHilbDLSB2
— Jay Shah (@JayShah) November 27, 2022
Narendra Modi Stadium receives ‘Guiness World Record’ for the biggest T20 audience during the IPL 2022 Final.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2022