ఆ పేషెంట్ కి అధిక రక్తపోటు.
1994లో తొలిసారి కిడ్నీ మార్పిడి!
2005లో రెండోసారి!!
జులై 10న మూడవసారి!!!.
తనవి రెండు దాతలు ఇచ్చినవి మూడు.
మొత్తం అయిదు కిడ్నీలతో ఇంటికి… అదెలా?..
సాధారణంగా దాతల కిడ్నీలను పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. 41 ఏళ్ల రోగి విజయవంతంగా మూడవసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. విపరీతమైన రక్తస్రావం ప్రాణాంతక పరిస్థితిని నివారించడానికి వైద్యులు గతంలో మార్పిడి చేసిన మూత్రపిండాలు మూత్రపిండాలను అలాగే ఉంచారు.
కొత్త కిడ్నీ అమర్చేప్పుడు పాతవి గనుక తొలిగిస్తే రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్ కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు.
సదరు వ్యక్తికి అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్ ఉన్న కండిషన్కి ఆ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించలేదు.
ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా నెల తర్వాత ఆ పేషెంట్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు.