మీరు చదువు పూర్తై ఖాళీగా ఉన్నారా? ఎప్పట్నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎయిర్ పోర్ట్ అథారిటీ సంస్థ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైతే చాలు ఉద్యోగం పొందొచ్చు.
చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరు కలలుకంటుంటారు. దాని కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే కొందరు ప్రభుత్వ కొలువులకు పోటీపడితే, మరికొందరు ప్రైవేట్ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ గుడ్ న్యూస్ అందించింది. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐ సీఎల్ఏఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎప్పట్నుంచో చదువు పూర్తై ఖాళీగా ఉండి, మంచి ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక సువర్ణావకాశం. మరి ఈ పోస్టులకు అర్హత ఏంటీ? జీతం ఎంత? ఆ వివరాలు మీకోసం..
చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్తనందించింది. ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు ఎయిర్పోర్టులో ఉద్యోగం సాధించొచ్చు. ఎలాంటి పరీక్ష రాయకుండానే, కేవలం ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జీతం నెలకు రూ.21,300 వరకు చెల్లిస్తారు.
అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 2 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన సమాచారం:
పోస్టులు: ట్రాలీ రిట్రీవర్లు
మొత్తం ఖాళీలు: 105
అర్హతలు:
అర్హత: 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత
వయసు: 18-27 ఏళ్లు
జీతం: నెలకు రూ.21300
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: 250.
దరఖాస్తు ప్రారంభం: 02.08.2023
దరఖాస్తు చివరి తేది: 31.08.2023.
మరిన్ని వివరాలకు http://aaiclas.aero/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.