కైలాస పర్వతం.. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువుండే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఎన్నో యుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో ప్రతిధ్వనించే పుణ్యస్థలం ఇది. హిందూ మతమే కాకుండా బౌద్ధ, జైన, బోన్ (ఒక టిబెట్ మతం) మతాలు ఈ పర్వతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాయి. ప్రతి ఏడాది వేలాదిమంది దైవ భక్తులు సందర్శించే కైలాసగిరికి, వేరే పుణ్య క్షేత్రాలకు చాలా తేడా ఉందని చరిత్ర చెబుతుంది. ఆదియోగి నివాసముండే ఈ మహా పర్వతం పై అందరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి.
దాదాపు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ పరమశివుడి పర్వతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
* కైలాశ(సంస్కృతంలో) అంటే “స్ఫటికం” అని అర్థం. సంస్కృత పదం కేలస నుండి ఈ పదం వచ్చిందని భావిస్తారు. చరిత్ర ప్రకారం.. దుష్ట శక్తులను, బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతపు శిఖరాగ్రంలో భార్య పార్వతితో నివసిస్తాడు. ఇక్కడ వారిద్దరూ నిరంతర ధ్యాన స్థితిలో ఉంటారు.
* ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలలో కైలాసగిరి కూడా ఒకటి. ఈ పర్వతం ఎత్తు సుమారు 6.6 కిలోమీటర్లు. ఇప్పటివరకు ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన వారున్నారు. కానీ కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన మనుషులు లేకపోవడం గమనార్హం. కారణం తెలీదు గాని కైలాసగిరిని ఛేదించడం ఎవరికీ సాధ్యపడలేదు.
* ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నిస్తే మ్యాప్ లో టార్గెట్ లొకేషన్ మారిపోతూ ఉంటుందని.. అలాగే కైలాస పర్వతానికి దగ్గరగా వెళితే మన వెంట్రుకలు, గోళ్లు తొందరగా పెరుగుతాయని(2 వారాల్లో పెరగాల్సినవి 12 గంటల్లో పెరుగుతాయి) అంటుంటారు.
* భారత సైనికులు, చైనా సైనికులు చెప్పిన దాని ప్రకారం.. కైలాస గిరి నుండి అప్పుడప్పుడు ఓ కాంతి వెలువడుతుందట. ప్రతి సంవత్సరం నానాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వేలమంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు. ఈ పర్వతం దగ్గర మానస సరోవరం(దేవతల సరస్సు), ఓ రాక్షసుల సరస్సు ఉంటుంది.
* మానసరోవరం ఎలాంటి విప్పత్తులు వచ్చినా చెక్కుచెదరకుండా అలానే ఉంటుందని.. ఈ సరస్సులో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. మానసరోవరంలో మునకవేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ఇక్కడ సాక్ష్యాత్తు పార్వతిదేవి జలకాలాడిన పార్వతి కుండ్ కూడా ఉంటుంది. ఇక్కడ మరో చెరువు నెలవంక ఆకారంలో ఉండటం విశేషం. అదెలా అనేది సైన్స్ కి కూడా అర్థం కావడం లేదు.
* ఆసియాలోని అతి పెద్ద నదుల్లో పేరొందిన సింధు, సట్లేజ్ (సింధూ నదికి ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా, కర్నాలి (గంగానదికి ఉపనది) నదులు ఈ శిఖరాగ్రి సమీపంలోనే ఉద్భవించాయి. మహారాష్ట్ర ఎల్లోరా గుహల్లో కొలువైన పవిత్ర క్షేత్రం కైలాస క్షేత్రానికి.. కైలాస పర్వతం మీదుగా పేరు పెట్టినట్లు సమాచారం.
* ఈ పవిత్ర కైలాస పర్వత యాత్రని భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ – సెప్టెంబర్ మధ్యలో అనుమతిస్తుంది. 70 ఏళ్లకి తక్కువ వయసు ఉన్నవారికకే ఈ కైలాసనాథుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు. మరి ఈ కైలాస నాథుడి గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.