దీపావళి.. ఈ పండుగకు భారతదేశంలో ఎంతో విశిష్టత ఉంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. పెద్దవాళ్లు దీపావళికి దీపారాధన చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించుకోవడం చేస్తుంటారు. పిల్లలు అయితే టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నిజానికి ఈ దీపావళిని ప్రాంతాలవారీగా వారి వారి సంప్రదాయాలను బట్టి చేసుకుంటూ ఉంటారు. కొందరైతే ఈ పండుగను 5 రోజులు చేసుకుంటారు. ధనత్రయోదశి నుంచి మొత్తం ఐదు రోజులు పర్వదినాలుగా చెబుతుంటారు. ఒక్కో రోజుకు ఒక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజును బట్టి మనం పండుగ జరుపుకుంటూ ఉంటాం. కొందరైతే కేవలం దిపావళి రోజును మాత్రమే జరుపుకుంటూ ఉంటారు. కొందరైతే అసలు దీపావళిని చేసుకోని వారు కూడా ఉంటారు.
అయితే ఈ ఏడాది మాత్రం చాలా మందికి తీపావళికి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటిలా కాకుండా ఈసారి నరక ఛతుర్దశి, దీపావళి రెండూ ఒకేరోజు వచ్చాయి. అసలు దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అయితే 25న పాక్షిక సూర్యగ్రహణం ఉండటం, అమావాస్య తిథి కూడా వెళ్లిపోతుండటంతో ఈనెల 24నే దీపావళి జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లులు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలపై ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ రమా రావి సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కింది వీడియోలో పూర్తి వివరాలను చూసి తెలుసుకోండి.