ఈ ఏడాది దీపావళి పండుగ నిర్వహణ విషయంలో ఎంత గందరగోళం నెలకొన్నదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపావళి పండుగ జరుపుకునే అమావాస్య నాడే సూర్య గ్రహణం ఏర్పడటంతో.. పండుగ ఏరోజు జరుపుకోవాలనే దాని గురించి గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు నరక చతుర్దశి రోజునే దీపావళి జరుపుకోవాలని సూచించారు. అలానే కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో కార్తీక దీపం వెలిగిస్తారు. చాలా మంది ఆ రోజు నోములు కూడా ఆచరిస్తారు.
అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో.. ఏ రోజు 365 వత్తులతో దీపం వెలిగించాలనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ ప్రశ్నలన్నింటికి రమా రావి సమాధానం చెప్పారు. సుమన్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి.. ఏ రోజు 365 వత్తులతో దీపం వెలిగించాలో వివరంగా తెలియజేశారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.