ఆమె పేరు దీక్షిత (పేరు మార్చాం). వయసు 19 ఏళ్లు. ఉన్నత చదువులు చదివి గొప్పగా స్థిరపడాలనే కలలు కంటుండేది. తనకు ఎన్ని ఖర్చులు ఉన్నా తల్లిదండ్రులను చెయి చాచి అడిగింది లేదు. తన స్వశక్తితో తన ఖర్చులను తానే తీర్చుకోవాలనుకుంది. దీంతో చదువుకుంటూనే స్థానికంగా ఉండే ఓ రిసార్ట్స్ లో రిసెప్షనిస్ట్ గా పనికి కుదిరింది. అలా తన గమ్యానికి దగ్గరలోనే ఉన్నాను అనుకుంటున్న తరుణంలోనే ఉన్నట్టుండి దారుణ హత్యకు గురైంది. ఇటీవల ఉత్తరాఖండ్ లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలను సృష్టిస్తుంది. అసలు ఈ 19 ఏళ్ల యువతిని ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో మాజీ మంత్రి వినోద్ ఆర్యకు పుల్కిత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను స్థానికంగా వనతారా రిసార్ట్ ని నడిపిస్తున్నాడు. అయితే ఇదే రిసార్ట్ లో శ్రీకోట గ్రామానికి చెందిన దీక్షిత అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. దీక్షిత రోజూ వస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఈ రిసార్ట్ యజమాని పుల్కిత్ దీక్షితపై కన్నేశాడు. గత కొంత కాలం నుంచి పుల్కిత్ దీక్షితపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 18న పుల్కిత్ ఏదో విషయంలో దీక్షితతో ఆమె సహోద్యోగుల ముందే గొడవ పెట్టుకున్నాడు. పరుష పదజాలంతో దీక్షితను దూషించాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది.
ఇక పక్కా ప్లాన్ ప్రకారమే ఆ రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత గుప్తా దీక్షితను తమ వాహనాల్లో ఎక్కించుకుని రిషికేష్ వెళ్లారు. వీరి వెంట పుల్కిత్ కూడా ఉన్నాడు. అక్కడికి ఓ బ్యారెజ్ వద్దకు మరోసారి పుల్కిత్ దీక్షితతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో పుల్కిత్ దీక్షితను పక్కనే ఉన్న కాలువలోకి తోసేసి దారుణంగా హత్య చేశాడు. దీక్షిత అరుపులు, కేకలు వేస్తూ చివరికి ప్రాణాలు విడిచింది. అయితే సెప్టెంబర్ 18న రాత్రి అయినా దీక్షిత ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా అంతా వెతికారు. ఎక్కడా కూడా కూతురు జాడ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె పని చేసే రిసార్ట్ నిర్వాహకులను పరిశీలించారు.
ఆ తర్వాత స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి పోలీసుల విచారణలో దీక్షితను రిసార్ట్ యజమాని పుల్కిత్ హత్య చేసినట్లుగా తేలింది. వెంటనే దీక్షిత తోసేసిన కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు దీక్షిత శవాన్ని బయటకు తీసి పోస్ట మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దీక్షిత హత్యలో స్థానిక మాజీ మంత్రి తనయుడు పుల్కిత్ పాత్ర ఉండడంతో రాజకీయంగా కూడా పెను ప్రకంపనలకు దారి తీసి సంచలనంగా మారింది. ప్రభుత్వం సైతం దీక్షిత హత్యపై స్పందించింది. ఇక అధికారులు పుల్కిత్ రిసార్ట్ ను బుల్డోజర్ల సాయంతో ధ్వంసం చేశారు.
దీక్షిత కుటుంబ సభ్యులు ఆమె హత్యపై నిరసనలు తెలియజేశారు. ఇక దీక్షిత తల్లిదండ్రులు మాత్రం.. మా కూతురిని ఆ దుర్మార్గులు అత్యాచారం చేసి చంపారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వాపోయారు. కూతురుని దారుణంగా హత్య చేయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఎట్టకేలకు పోలీసులు నిందితులైన రిసార్ట్ యజమాని పుల్కిత్, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Uttarakhand: Illegal construction at Vanantra resort demolished by bulldozer in Ganga Bhogpur Talla
Accused Pullkit Arya, son of BJP leader, is owner of resort. Accused Saurabh Bhaskar, Ankit Gupta are workers of resort.
Receptionist Ankita Bhandari was killed & thrown in canal pic.twitter.com/nObxRAwddC
— Anshul Saxena (@AskAnshul) September 23, 2022