ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు.. మాటువేసి మెడలోని ఆభరణాలు లాక్కుని పరారవుతున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే చైన్స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సిబ్బందిపై దాడి చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. చైన్ స్నాచింగ్ సమయంలో కొంత మంది మహిళలు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా జనగామ జిల్లా అంబేద్కర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో 9 నెలల చిన్నారి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు ని తెంపే ప్రయత్నం చేశాడు చైన్ స్నాచర్. ఈ ఘటన జనగామాలోని అంబేద్కర్ కాలనీలో జరిగింది. బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్ ని ఆ మహిళ ప్రతిఘటించింది. ఇద్దరి మద్య పెనుగులాటలో తన తొమ్మిది నెలల తేజస్విని పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయిందని.. దాంతో చైన్ స్నాచర్ ని వదిలేసి.. పాపను కాపాడే ప్రయత్నం చేసింది తల్లి. నీటి సంపు నుంచి పాపను బయటకు తీసి వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అప్పటి వరకు తమ ఇంట్లో నవ్వులు చిందిస్తూ కనిపించిన చిన్నారి.. కళ్ల ముందే చనిపోవడంతో తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తేజస్విని మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.