గచ్చిబౌలి సునీత ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. భర్త అత్తమామలు వేధింపులను భరించలేకే సునీత బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అయితే ఈ కేసులో సునీత తల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని నిజాలు బయటకు వచ్చాయి. భర్త, అత్తమామలు కొత్త కారు కొనాలని, దీనికి పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తేవాలని సునీతను వేధించినట్లుగా తెలుస్తోంది.
మా కూతురిని భర్తతో పాటు అత్తమామలు కూడా తీవ్రంగా కొట్టారని, వీటిని భరించలేని ఫోన్ చేసి బోరున విలపించిందని వివరించారు. అనంతరం మా కూతురికి ఫోన్ చేయగా స్విఛాప్ వచ్చిందని.., తర్వాత వెళ్లి చూసేసరికి చనిపోయి ఉందని సునీత తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అసలేం జరిగిందంటే? విజయనగరం జిల్లా కొండకరకం గ్రామానికి చెందిన సునీత అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. అయితే రమేష్ ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా రమేష్ హైదరాబాద్ కు బదిలీ కావడంతో గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ లో దంపతులు ఇద్దరు కాపురం పెట్టారు.
కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ భర్త రమేష్ కు డబ్బు మీద వ్యామోహం ఉండడంతో భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. భర్తకు అత్తమామలు కూడా సపోర్ట్ ఇవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కొంత కాలం భర్త, అత్తమామల వేధింపులను భరించిన సునీత.., ఆగడాలు శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల గురువారం భర్త విధులకు వెళ్లగానే భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి చూడగా భార్య వేలాడుతూ కనిపించే సరికి భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరతించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలన కామెంట్ రూపంలో తెలియజేయండి.