కొందరు కొద్దిపాటి క్షణికావేశంలో కొందరు దేనికైన తెగిస్తూ చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో పాతకక్షల నెపంతో ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇటీవల జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లక్కవరం గ్రామంలో బాతుక మహేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండేవాడు.
అయితే గత కొన్నేళ్ల నుంచి ఇదే గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం కొనిసాగిస్తున్నాడని కుటుంబ సభ్యులు సైతం మహేష్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాటు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడుస్తున్నకొద్ది సైదులుకు మహేష్ పై పగ మాత్రం మరింత పెరుగుతుంది. అయితే నాలుగేళ్ల పగతో ఊగిపోతున్న సైదులు సమయం దొరికితే ఎలాగైన మహేష్ ను చంపాలని మాత్రం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. అనుకున్నట్లుగానే మంగళవారం ఉదయం మహేష్ బైక్ పై ఒంటరిగా వెళ్తున్నట్లు గమనించాడు సైదులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీంతో మహేష్ వెంటనే ట్రాక్టర్ తో వెళ్లి సైదులు అతడిని ఢీకొట్టాడు. వెంటనే మహేష్ పక్కనున్న నాటు వేసే పొలంలో ఎగిరిపడ్డాడు. అయినా వదలని ఆ దుర్మార్గుడు ట్రాక్టర్ చక్రాల కింద మహేష్ ని నలిపేశాడు. చనిపోయాడని తెలియడంతో నిందితులు ఘటన స్థలం నుంచి ట్రాక్టర్ అక్కడే వదిలి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.