మూగజీవాలపై చాలా మంది ప్రేమ చూపిస్తుంటారు. వాటిని చేరదీసి.. వాటి ఆకలి తీరుస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగ జీవాలంటే అసహించుకుంటారు. అంతటితో ఆగక వాటిపై దాడులకు పాల్పడతారు. మరికొందరు మూగ జీవాలను తీవ్రంగా హింసించి చంపేస్తుంటారు. అచ్చం ఆ కోవాకు చెందిన వారే ఖతర్ లోని కొందరు సాయిధ బలగం. తమ బిడ్డను ఒక కుక్క కరచిందని.. ఏకంగా 29 కుక్కలను కాల్చి చంపారు సాయిధ బలగాల బృందం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
ఖతర్లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థ పదుల సంఖ్యలో కుక్కలు సంరక్షించబడుతున్నాయి.అయితే ఆ కుక్కలలోని ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలో ఉన్న 29 కుక్కల పై సాయుధ బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఈ కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చొరబడి.. అక్కడ ఉన్న సెక్కూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి.. అక్కడున్న కుక్కలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశారని, ఈ ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది .
ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు సాయుధ బలగాల బృందం పేర్కొన్నారని వెల్లడించింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం వచ్చేలా చేసింది. జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.