ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్న కొడుకే హంతకుడై పిన్నీ,బాబాయ్, చెల్లెలిపై విచక్షణ రహింతంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన కుక్క రాములయ్య, ఈశ్వరయ్య దంపతులు.
వీరికి ఓ కూతురు స్వప్న కూడా ఉంది. అయితే గత కొంత కాలం నుంచి ఈశ్వరయ్య అన్న కొడుకు కుక్క మల్లిఖార్జున్ ఈశ్వరయ్య దంపతులు క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వారితో పలుమార్లు గొడవకు దిగాడు. అయితే ఇదే విషయమై నాలుగు రోజుల క్రితం మల్లిఖార్జున్ పిన్నీ, బాబాయ్ తో గొడవకు దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మల్లిఖార్జున్ పిన్నీ,బాబాయ్, చెల్లిలు స్వప్నలపై తీవ్రంగా దాడి చేశాడు.
ఇది కూడా చదవండి: బతికుండగానే భార్యకు నరకం చూపించిన భర్త.. అశ్లీల వీడియోలు చూపిస్తూ!
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్య, రాములమ్మ ఒకరి తర్వాత ఒకరు ఒక రోజు వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది మరువక ముందే నేడు గర్భంతో ఉన్న చెల్లెలు స్వప్న కూడా దాడిలో తీవ్రంగా గాయపడి మరణించింది. ఒకే ఇంట్లో ముగ్గురు మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.