పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ సారా తాగి 9 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హోవ్ డా, ఘసురీ ప్రాంతాల్లో ఉన్న ఓ ఫ్యాక్టరీల్లో కొంత మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీకి దగ్గరలోనే ప్రతాప్ కర్మాకర్ అనే వ్యక్తి లిక్కర్ షాపును నడిపిస్తున్నాడు. కాగా మద్యానికి అలవాటు పడ్డ ఆ కార్మికులు రోజూ అక్కడికి చేరుకుని మద్యం తాగేవారు. అయితే ఇటీవల ప్రతాప్ తన వద్ద నున్న కల్తీ సారాను తాగడానికి వచ్చిన కొంతమందికి అమ్మాడు.
ఇది కూడా చదవండి: బతికుండగానే భార్యకు నరకం చూపించిన భర్త.. అశ్లీల వీడియోలు చూపిస్తూ!
ఇది తాగిన 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ 9 మంది అమాయకపు కార్మికులు మృతి చెందారు. అయితే ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లకుండా స్థానికులు వారి శవాలను ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కల్తీ సారా తాగి మరణించిన 9 మంది కార్మికుల విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.