పూర్వం నుంచి వరకట్నం అనేది అనాధికారికంగా వస్తుంది. డబ్బులను, స్థలాను, ఇళ్లను, బంగారాన్ని వరకట్నంగా ఆడపిల్లల తల్లిదండ్రులు సమర్పిస్తుంటారు. కానీ ఓ ప్రాంతం వాళ్లు కుక్కలను వరకట్నంగా ఇస్తున్నారు.
పూర్వం నుంచి వరకట్నం అనేది అనాధికారికంగా వస్తుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు కాబోయే అల్లుడికి వరకట్నం ఇస్తుంటారు. వారి వారి స్థోమతను బట్టి ఆడపిల్లతో పాటు కట్నకానుకలు సమర్పించుకుంటారు. డబ్బులను, స్థలాను, ఇళ్లను, బంగారాన్ని వరకట్నంగా ఆడపిల్లల తల్లిదండ్రులు సమర్పిస్తుంటారు. కానీ ఓప్రాంతంలో మాత్రం కుక్కలను కట్నంగా ఇస్తున్నారు. శునకరాజాలను ఆస్తిగా భావిస్తూ.. ఆడపిల్లలకు కట్నంగా కొన్ని కుటుంబాలు ఇస్తున్నాయి. వాళ్లెవరూ, వారి జీవనశైలి ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా..!
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కొండాపూర్, బావుసాయిపేట, రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ మూడు గ్రామాలకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేస్తుంటారు. వీరు కుక్కలను పెంచుకుని, వాటిని వేటకు, రక్షణకు ఉపయోగిస్తారు. ఒక్కో కుటుంబంలో ఐదు నుంచి ఐరవై శునకాలను పెంచుతుంటారు. కుక్కలను ఆస్తిలా భావించే ఈ ఆచారం ఈ కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతోంది. ఎన్ని ఎక్కువ శునకాలను పెంచితే అంత ఆస్తిపరులన్న మాట.
వారు పెంచుకుంటున్న కుక్కలను బట్టే వారికి గౌరవం లభిస్తుంది. అలానే ఆడ పిల్లలకు పెళ్లిలో కట్నంగా కుక్కలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబాల్లో మార్పు వస్తోంది. ఈ ఆచారం గురించి ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తమకు కుక్కలను పెంచడం ఆనవాయితీగా వస్తోందని, ఇంటి ముందు ఎన్ని ఎక్కువ కుక్కలుంటే అంత విలువ ఉండేదని, నేటికి కూడా ఉన్నాయని తెలిపాడు. తాము ఏం తింటే అదే వాటికి పెడతామని, తమతోనే అవి ఉంటాయని రాజయ్య అనే వ్యక్తి తెలిపాడు. మరి.. ఈ కుటుంబాల్లో ఉన్న వింత ఆచారంపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.