తల్లిదండ్రుల వద్ద నేర్చుకోలేని పాఠాలను గురువులు బోధిస్తుంటారు. నాలుగు, ఐదేళ్లు వచ్చే సరికి బడికి, యుక్త వయసులో కాలేజీలకు వెళ్లిపోతుంటాం. సగం జీవితం వీటిల్లో గడుస్తుంది. గురువులు వద్ద నేర్చుకునే పాఠాలే భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయి. అటువంటి గురువు హోదా ఉన్న ప్రిన్సిపల్ పై కక్ష గట్టాడో విద్యార్థి.
తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానం అంటారు పెద్దలు. తల్లిదండ్రుల వద్ద నేర్చుకోలేని పాఠాలను గురువులు బోధిస్తుంటారు. పుట్టిన ఓ నాలుగు ఐదేళ్ల తర్వాత బడులకు, ఆ తర్వాత కాలేజీలకు వెళ్లిపోవడంలో సగం జీవితం గడిచిపోతుంది. ఈసమయంలో తల్లిదండ్రుల తర్వాత గురువుల వద్దే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాం. మనకు గురువులు నేర్పించే పాఠాలు భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయి. మనం మాట వినకపోతేనో, అల్లరి ఎక్కువ చేస్తే, భరించలేని స్థితిలో ఉంటే.. ప్రిన్సిపల్స్ చెబుతుంటారు టీచర్స్. మనం చెడు దారిలో నడుస్తుంటే.. మందలించేదీ వాళ్లే.. దాని పెట్టేదీ వాళ్లే. అందుకే ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఉపాధ్యాయులు ఒకరు ఉంటారు. కానీ ఈ విద్యార్థి మాత్రం తన ప్రిన్సిపల్ పైనే కక్ష గట్టాడు. ఏకంగా ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించాడు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని బిఎం కాలేజ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు విముక్త శర్మ (54). అశుతోష్ శ్రీవాస్తవ (24) అనే విద్యార్థి గత ఏడాది ఇదే కళాశాలలో బి ఫార్మసీ కోర్సును పూర్తి చేశాడు. అయితే అతడికి మార్కుల షీటు ఇవ్వలేదు. దీని కోసం పలుమార్లు అడిగినా కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదు. దీంతో దీనికి ప్రిన్సిపల్ కారణమని భావించిన ఆ విద్యార్థి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుప్రతికి తరలించారు. అశుతోష్ ను పోలీసులు అరెస్టు చేయగా.. గత నాలుగు నెలలుగా తనకు మార్కులు షీటు ఇవ్వాలని కోరినప్పటికీ ఆమె ఇవ్వకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఆమెపై నాలుగు నెలల క్రితం కూడా కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.
ఆ సమయంలో అశుతోష్ గాయపడగా.. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, అతడి మార్కుల షీటు తమ వద్దకు రాలేదని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. అయితే బెయిల్ పై విడుదలైన మాజీ విద్యార్థి .. మళ్లీ ఆమెపై ఈ దాడికి ఒడిగట్టాడు. పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత.. అతడు అక్కడ నుండి పారిపోయి సమీపంలో ఉన్న ఓ జలపాతంలోకి దూకబోయాడు. అయితే అక్కడే ఉన్న వ్యక్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేయడంతో.. ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రిన్సిపల్ 80 శాతం గాయాలవ్వగా.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గురువు వంటి ప్రిన్సిపల్ పై విద్యార్థి దాడికి పాల్పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.