సమాజంలో రోజు రోజుకీ అక్రమ దందాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. పైకి అమాకంగా కనిపిస్తూ లోపల తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు.
ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం ఎన్నో చేయరాని తప్పులు చేస్తున్నారు. బయటికి అమాయకంగా కనిపిస్తూ పలు అక్రమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి ఎన్నో అక్రమ దందాలకు పాల్పడుతూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. కొంత మంది సొసైటీలో పెద్దమనుషులుగా చెలామని అవుతూ లోపల మాత్రం చిల్లర పనులు చేస్తుంటారు.. మరికొంతమంది అమాయకంగా నటిస్తూ మనమద్యనే తిరుగుతూ ఉంటారు.. పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేశాక తెలుస్తుంది వారు ఎలాంటి నేరాలు చేస్తారో అని.. అందుకే ఎవరినీ అంత తొందరపడి నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తుంటారు. ఓ యువతి ఎంతో అమాకంగా కనిపిస్తూ మార్కెట్ సెంటర్లో సోప్ బాక్సులు అమ్ముకొని జీవిస్తుంది.. కట్ చేస్తే పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేసి అసలు నిజాలు బయటపెట్టడంతో అందరూ ఒక్కసారే షాక్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మిజోరం రంగ్వమ్వాల్ లో ఉంటున్న లల్రామ్మావి అనే యువతికి ఎలాంటి ఉద్యోగం లేక కొంత కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంది. దీంతో పొట్ట కూటి కోసం మార్కెట్ సెంటర్లలో సబ్బు పెట్టులు అమ్ముకుంటూ కొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఒక్కో సబ్బు పెట్టె విలువ రూ.10 చొప్పున అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది . ఇలా ఆమె జీవితాన్ని సాగిస్తున్న సమయంలో మంగళవారం మిజోరం డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ యువతి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసుకొని తీసుకు వెళ్లారు. ఆ యువతి వద్ద ఉన్న సుమారు 21 సబ్బు పెట్టెలు సైతం తీసుకు వెల్లారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యపోయారు.. ఎంతో పేద రికంలో ఉంటూ.. అమాకంగా ఉన్న ఆ యువతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని ఆశ్చర్యపోయారు. మార్కెట్ లో సోప్ బాక్సులు అమ్ముకోవడం కూడా తప్పేనా.. అందుకోసం అరెస్ట్ చేస్తారా? అన్న అనుమానాలు వచ్చాయి.. కానీ ఎవరూ పోలీసులకు ఎదురు నిలిచి ప్రశ్నించలేకపోయారు.
ఆ యువతిని ఎందుకు అరెస్ట్ చేశాము అని అందరి అనుమానాలు తీర్చేందుకు ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆ యువతి కేవలం సబ్బు పెట్టెలు మాత్రమే అమ్మడం లేదని.. వాటిలో అతి ప్రమాదకరమైన మత్తుపదార్థాలను పెట్టి అమ్ముతుందని తెలిపారు. మార్కెట్ లో రోడ్డు పై సబ్బు పెట్టెలు అమ్ముకుంటుందని.. చాలా అమాకంగా ఉందని ఎవరూ పట్టించుకోలదని.. పక్కా సమాచారం వచ్చిన తర్వాతనే ఆమెను అరెస్ట్ చేశామని అన్నారు. సబ్బు పెట్టెల్లో 239.95 గ్రాముల కొకైన్ దాచి ఉంచిందని.. దాని విలువ 1.19 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. లల్రామ్మావి దగ్గర నుంచి దాదాపు 21 బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఇది విన్న మీడియా ప్రతినిధులకు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
సమాజంలో మన పక్కనే ఎంతో అమాకంగా ఉంటూ అక్రమ దందాలకు పాల్పడుతుంటారని.. అలాంటి వారు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి అక్రమార్జనకు పాల్పపడే వారు ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నారని.. తమకు డబ్బు మాత్రమే ప్రాధాన్యం అని భావించే వారు.. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. డ్రగ్స్ అమ్మినా.. కొన్నా నేరం అని అలాంటి వారిని పట్టించే బాధ్యత సామాన్య పౌరులకు ఉంటుందని అన్నారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
While we are committed to #SupplyDisruption, we want other stakeholders to make all out efforts for #DemandReduction in #WarOnDrugs. Together we can and we will achieve the dream of #DrugFreeMizoram. Last night, District Special Branch (DSB) Aizawl staff seized 21 soap cases of pic.twitter.com/Ylqwr8BBoP
— Mizoram Police (@mizorampolice) February 14, 2023