28 మంది మహిళలు., నలుగురు బాలురు, 500కు పైగా కండోమ్లు. ఇలా చీకటిగా సాగిస్తున్న వ్యభిచారం దందా గట్టు రట్టైన ఈ ఘటన అందరికి దడపుట్టించేలా చేస్తుంది. తాజాగా మేఘాలయలో వెలుగు చూసిన ఈ ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై పక్కా స్కెచ్ తో వెళ్లిన పోలీసులకు ఈ చీకటి వ్యభిచారం దందా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మేఘాలయలోని వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణం. స్థానిక రాజకీయ నాయకుడైన బెర్నార్డ్ మారక్ తన ఫామ్ హౌస్ లో గట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎంతో మంది అమాయకులను తీసుకొచ్చి వ్యభిచార ముగ్గులోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లుగా సమాచారం. ఇలా తన ఫామ్ హౌస్ లో చీకటి వ్యభిచారాన్ని నడిపస్తున్నాడన్న సమాచారం పోలీసులకు తెలియడంతో పక్కా ప్లాన్ తో బయలు దేరి ఆకస్మిక రైడ్ నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పోలీసులు నలుగురు బాలురులను రక్షించి.. వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్ చేశారు. వారిలో 23 మంది మహిళలు ఉండడం విశేషం.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? వారున్న గదుల్లో 500 పైగా కండోమ్ లు దొరకడం అందరిని షాకింగ్ కు గురి చేస్తుంది. ఇక వీటితో పాటు400 మందు బాటిళ్లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వ్యభిచార నిర్వాహకుడైన బెర్నార్డ్ మారక్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మారక్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!