జీవితంలో ఎన్నో కలలు కంటూ చదువును కొనసాగించింది. అందరి ముందు తలదించకుండా ఉన్నతమైన హోదాలో ఉండాలనే ఆశలు పెంచుకుంది. ఇంజనీరింగ్ చదివి ఈ యువతి ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆ యువతి తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఊహించని ఆమె మరణం తల్లిదండ్రుల గుండె బరువెక్కేలా చేసి కంట కన్నీరు తెప్పిస్తుంది.
అసలుం ఏం జరిగిందంటే? వనపర్తి పట్టణానికి చెందిన రమ్య కుటుంబ సభ్యులు ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రమ్య కొంత కాలం పాటు ఇంటి నుంచే కాలేజీకి వెళ్లింది. అయితే రాను పోను రవాణాలో ఇబ్బందులు తలెత్తడంతో బీఎన్ రెడ్డినగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ అక్కడి నుంచి కాలేజీకి వెళ్లేది. అయితే శనివారం రమ్య తన స్నేహితులతో పాటు కలిసి హాస్టల్ రెండో భవనంపైన రేలింగ్ పై కూర్చుని ఫోన్ మాట్లాడుతోంది. అయితే ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడింది.
వెంటనే గమనించిన తోటి స్నేహితులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక తలకు తీవ్రంగా గాయం అవ్వడంతో చికిత్స పొందుతూ రమ్య ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అలా ఉండగా వీడియోలు తీసి ఆ వెబ్సైట్కు అమ్మాడు!