ఈ మద్య విమాన, హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య పెరిగితున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ప్రతికూల వాతావరణం వల్లనో.. టెక్నికల్ ఇబ్బందుల వల్లనో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. టేకాఫ్ అయినా.. వాతావరణ పరిస్థితులను అంచనావేసి వెంటనే అప్రమత్తమై పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేయడం వల్ల ప్రాణాలతో సురక్షితంగా బయట పడుతున్నారు. గతంలో పలువురు రాజకీయ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. ఆ మద్య ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగానే అవాంతరం ఏర్పడటంతో వెంటనే ల్యాండింగ్ చేశారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ టెకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్ కి సంబంధించిన ఓ వీడియోని సీఎంవో అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ల్యాండ్ అయిన తర్వాత సీఎం రోడ్డు మార్గాన నడుచుకుంటూ అక్కడి సిబ్బందితో భోజనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంగ్మా ‘హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ప్రతికూల వాతావరణం గమనించిన పైలెట్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.. వారి సూచనల మేరకు ఒక కాలేజ్ గ్రౌండ్ లో సురక్షితంగా హెలికాప్టర్ ని ల్యాండ్ చేశారు. దీంతో అందరం ఊపిరి పీల్చకున్నాం.. అక్కడ కాలేజ్ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది.. ఉమియం సరసు అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.. కాలేజ్ సిబ్బందితో భోజనం చేశాను.. మమ్ముల్ని రక్షించిన కెప్టెన్, పైలెట్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను..’ అంటూ ట్విట్ లో పేర్కొన్నారు.
What an adventure!
•Emergency Landing at UCC, Umiam due to bad weather
•Enjoyed the beautiful scenery in the Campus
•Met with staff of UCC
•Lunch in UCC CanteenThe weather is truly unpredictable. Thank the Captain & Pilot for bringing us back safely. pic.twitter.com/D4rMAzGYhC
— Conrad Sangma (@SangmaConrad) November 2, 2022