హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచులపై పందేలు నిర్వహిస్తున్న ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
వేసవిలో అందరికీ అసలు సిసలైన మజాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అందిస్తోంది. సాయంత్రం పూట అందరూ మ్యాచ్లు చూసేందుకు టెలివిజన్ తెరలకు, మొబైల్స్కు అతుక్కుపోతున్నారు. టోర్నీ మొదలై దాదాపుగా రెండు వారాలు కావొస్తోంది. గత మూడ్రోజుల్లో జరిగిన మ్యాచ్లు ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతుండటం.. మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్తుండటంతో ప్రేక్షకులు ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నారు. టోర్నీ ఇలాగే సాగితే వ్యూస్ పరంగా దుమ్మురేపడం ఖాయంలా కనిపిస్తోంది. ఏ జట్టు కూడా తగ్గేదేలే అంటుండటంతో ఈసారి కప్ ఎవరు కొడతారో పక్కాగా చెప్పలేని పరిస్థితి.
ఐపీఎల్ వేళ బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. కోట్లకు కోట్లు పందేలు కాస్తూ బిజీ అయిపోతున్నారు. ఇలా పందాలు కాస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గత రెండ్రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడుతున్న ఒక ముఠాను, షాద్నగర్లో మరో బెట్టింగ్ మరో ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఒక అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కీలక సూత్రధారులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గరి నుంచి ల్యాప్ట్యాప్లతో సహా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Cricket betting gang busted in Hyderabad – TV9#CricketBetting #Hyderabad #IPL #TV9Telugu pic.twitter.com/OKLAbouGAn
— TV9 Telugu (@TV9Telugu) April 11, 2023