ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
“ధోని-జడేజా”.. ఈ బాండ్ కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. టీమిండియాలోని కాదు ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో వీరిద్దరు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఐపీఎల్ లో వీరి జోడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి హైలెట్ గా మారింది. టీంలోకి ఎంత మంది వచ్చి వెళ్లినా వీరిద్దరిని మాత్రం చెన్నై అంటిపెట్టుకునే ఉంది. రైనా, ధోని తర్వాత మళ్ళీ అలాంటి ఒక బాండ్ ధోని, జడేజా మధ్య ఏర్పడింది. అయితే ఐపీఎల్ 2023 లో భాగంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
ఐపీఎల్ 2023 లో ధోనిపై విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. వీటికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే.. జడేజా బ్యాటింగ్ కి వచ్చినప్పుడు అభిమానులు ఔటవ్వలని కోరుకుంటున్నారని విచారం వ్యక్తం చేసాడు. దీనికి తోడు జడేజా ట్వీట్ చేస్తూ .. “కర్మ మన దగ్గరకు తిరిగి వస్తుంది. అది రావడం కాస్త లేట్ అవుతుందేమో గాని తప్పకుండా వస్తుంది”. అని క్యాప్షన్ పెడుతూ థమ్స్ అప్ సింబల్ గుర్తు పెట్టాడు. జిడ్డు ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే తన భార్య రిబావ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. నీ దారిలో నువ్వు వేళ్ళు అంటూ చేతులు జోడించిన ఐకాన్ తో కామెంట్ పెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయనే దానికి బలం చేకూరింది. అయితే చెన్నై సీఈఓ విశ్వనాధ్ వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పేసాడు.
విశ్వనాధ్ మాట్లాడుతూ “జడేజా బ్యాటింగ్కు వెళ్ళినప్పుడు ధోని రావాలని ప్రేక్షకులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈవిషయంలో జడేజా బాధ పడి ఉండొచ్చు. ఏ ప్లేయర్ కైనా ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురవుతాడు. కానీ దీని గురించి జడ్డూ ట్వీట్ చేసినా.. ఎప్పుడూ ఎవరితోనూ ఏమీ అనలేదు. ఒక టీంకి సంబంధించి డ్రెస్సింగ్ రూంలో జరిగే విషయాలు బయటకు రాకూడదు. మాకు సంబంధించి జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. జడ్డూ ఎప్పుడూ ధోనీకి చాలా గౌరవం ఇస్తాడు. ఫైనల్ తర్వాత కూడా తన ఇన్నింగ్స్ను ధోనీకే అంకితం ఇచ్చినట్లు జడ్డూ చెప్పాడు. ధోనీ అంటే జడ్డూకు అంత రెస్పెక్ట్” అని విశ్వనాథ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని విశ్వనాథ్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.