వెస్ట్ ఇండీస్ తో జరిగిన 3వ టీ20 వరల్డ్ కప్ లో సిక్స్ కొట్టడమే ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేసిన తప్పు. అదేంటి సిక్స్ కొడితే కేరింతలు కొడతారు కదా.. మరి హార్దిక్ నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే.. అందులో స్వార్థం ఉంది. అందుకే కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోమని హార్దిక్ కి సలహా ఇస్తున్నారు.
నాయకుడు అంటే ముందు ఉండి నడిపేవాడు. కష్టం తనపైన వేసుకుని, ఫలాలను అందరికీ పంచేవాడు. ప్రత్యర్థిని పడగొట్టడం కన్నా.. తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇవన్నీ యుద్ధంలోనే కాదు, జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ లో కూడా వర్తిస్తాయి. టీమిండియాకి అలాంటి అద్భుతమైన కెప్టెన్స్ చాలా మందే దొరికారు. కపిల్, గంగూలీ, ధోని వీరు ముగ్గురు అందులో మెయిన్. వీరి కెప్టెన్సీలో ఆటగాళ్లు అంతా ఎంతో స్వేచ్ఛగా ఆడేవారు. అనవసరమైన ఒత్తిడి ఆటగాళ్ల దరి చేరేది కాదు. టీమ్ కి ఎలాంటి సమస్య వచ్చినా.., ఆటగాడికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కెప్టెన్స్ అంతా తాము ముందుండి ఆ సమస్యలను తీర్చేవారు. ఇక ఆటగాళ్లలో ఒక ఉత్తేజాన్ని నింపడానికి, వారిలో నమ్మకాన్ని పెంచడానికి కావాలంటే.. వారే ఒక మెట్టు తగ్గేవారు.
అలా.. స్వార్థం లేకుండా ఒక మంచి టీమ్ ని నిర్మించుకోవడంలోనూ, అద్భుతాలు సృష్టించడంలోనూ ఈ కెప్టెన్స్ సక్సెస్ అయ్యారు. కానీ.., తాజాగా వెస్టిండీస్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమయంలోనే అందరూ గతంలో ధోని చేసిన ఓ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు.3వ టీ20లో టీమిండియా విజయం సాధించడం మంచి విషయం. కానీ.., హార్దిక్ పాండ్యా ఓ కెప్టెన్ అయి ఉండి.. తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి సహకరించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హార్దిక్.. రెండు బాల్స్ డాట్ ఆడి ఉంటే.. తిలక్ వర్మ అర్ధ సెంచరీ పూర్తి అయ్యేది. కానీ.., మన కెప్టెన్ అలా చేయలేదు. తన స్టామినా చూపించుకోవడానికి సిక్స్ తో ఆటని ముగించాడు.
సరిగ్గా.. ఈ సమయంలోనే గతంలో ధోని చేసిన ఓ గొప్ప పనిని.. ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 2014 టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ అది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 172 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో ఎప్పటిలా కోహ్లీ రెచ్చిపోయాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా.. చివరి వరకు నిలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే మ్యాచ్ డ్రా కాగా.. రైనా అవుట్ అయ్యాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ధోని క్రీజ్ లోకి వచ్చాడు. 7 బంతుల్లో 1 రన్ చేయాలి. కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చిన కోహ్లీ అవతలి ఎండ్ లో ఉన్నాడు. ధోని తలుచుకుంటే ఆ ఒక్క బాల్ ని సిక్స్ కొట్టి తనదైన స్టైల్ లో మ్యాచ్ ముగించి ఉండవచ్చు. లేదా.. కనీసం ఓ సింగిల్ కొట్టి అయినా.. విన్నింగ్ రన్ అన్న ఖ్యాతి దక్కించుకోవచ్చు. కానీ.., ధోని ఆ పని చేయలేదు.
లాస్ట్ బాల్ ను కావాలని డిఫెన్స్ ఆడి, మ్యాచ్ పూర్తి చేసే బాధ్యత కోహ్లీకి అప్పగించాడు.వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ లో ధోని చేసిన త్యాగానికి అంతా షాక్ అయ్యారు. ఆఖరికి కోహ్లీ కూడా ఇదేంటి మహీ భాయ్.. నాపై ఇంత ప్రేమ అంటూ ఉప్పొంగిపోయాడు. అదీ టీమ్ లోని ఆటగాడి గురించి కెప్టెన్ ఆలోచించే లక్షణం. ఆరోజు కోహ్లీ ఒక జూనియర్ ప్లేయర్. అతనికి మరింత బూస్ట్ రావాలని, ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడని నమ్మే.. ధోని అలాంటి అవకాశం ఇచ్చాడు. కానీ.., ఇక్కడ హార్దిక్ పాండ్యా మాత్రం స్వార్ధంగా ఆలోచించి విమర్శల పాలు అవుతున్నాడు. కెరీర్ లో మూడో మ్యాచ్ ఆడుతున్న యువ క్రికెటర్ కు హాఫ్ సెంచరీ అంటే కాస్త స్పెషల్ ఉంటుంది. అది సాధిస్తే.. అతని ధైర్యం పెరుగుతుంది. కానీ.., హార్దిక్ పాండ్యా ఇవేవి ఆలోచించలేదు. దీంతో.. హార్దిక్ ఓ చెత్త కెప్టెన్ అంటూ నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా.. ఇకనైనా నిస్వార్ధంగా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకో అంటూ.. నెటిజన్స్, క్రికెట్ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి.., తిలక్ వర్మ విషయంలో హార్దిక్ స్వార్ధంగా ఆలోచించాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tilak Varma needs one run to score 50 and Hardik Pandya hits a six to win the game with 13 more balls to spare. 🤷♂️
Reminds me of this incident with MSD & VK
That’s how you encourage talent! pic.twitter.com/ESDmlExIyk
— KP (@karthikponnuri) August 8, 2023