దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఆడవారు కనిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లలా రెచ్చిపోతున్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన ఓ మహిళా ఎస్సై అత్యాచారానికి గురి కావడం కలకలం రేపుతుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గతంలో ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో బాధితురాలికి హోంగార్డు గా పని చేస్తున్న స్వామి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటికీ బాధితురాలి కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతుంది. తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న ఆమెకు స్వామి అన్ని విషయాల్లో ఎంతో సహాయ పడుతూ ఉండేవాడు. దీంతో ఆమెతో చనువు బాగా పెంచుకోవడం మొదలు పెట్టాడు.
తన మనసులో దుర్మార్గపు ఆలోచనలు ఉన్న స్వామి సమయం కోసం చూస్తున్నాడు. ఓ రోజు బాధితురాలికి మత్తు మంది ఇచ్చి లైంగిక దాడికి పాల్పపడమే కాకుండా దాన్ని వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత ఆమెను మానసికంగా, శారీకంగా బాధపెట్టడం మొదలు పెట్టాడు. కొంత కాలంగా అతడి వేధింపులు భరించి తట్టుకోలేక హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుంది బాధితురాలు.
స్వామి మాత్రం ఆమెను నీడలా వెంటాడుతూ.. హైదరాబాద్ వచ్చి బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడు. తాను కోరినంత ఇవ్వకుంటే వీడియో అందరికీ చూపిస్తానని.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇక అతని బాధలు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: భర్త కోసం ఓ భార్య పోరాటం.. పెళ్లైన రెండు వారాలకే!