భర్త వ్యామోహనికి గురై పరాయి స్త్రీ మోజులో పడిపోతున్నాడు. శారీరక సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు. భార్యా బిడ్డలకు అన్యాయం చేస్తూ.. ఆమెతోనే సంసారాన్ని కొనసాగిస్తున్నాడు.
అక్రమ, వివాహేతర సంబంధాలు మూడు ముళ్ల బంధాన్ని, పచ్చని సంసారాన్ని బీటలు వారుస్తున్నాయి. భర్త వ్యామోహనికి గురై పరాయి స్త్రీ మోజులో పడిపోతున్నాడు. శారీరక సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు. తల్లిదండ్రుల్ని, భార్యా బిడ్డలకు అన్యాయం చేస్తూ ఆమెతోనే సంసారాన్ని కొనసాగిస్తున్నాడు. భార్య తెలిసి అడిగితే ఘర్షణలు, గొడవలు చివరకు ఆమెపై దాడి కూడా చేస్తున్నారు. లేదంటే ఆమెకు విడాకులు ఇచ్చి నచ్చిన స్త్రీతో మళ్లీ ఏడడుగులు వేయడం లేదా అదే సహజీవనాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సాధారణంగా ఇదే జరుగుతుంది. కానీ ఈ భర్త.. శాడిజాన్ని ప్రదర్శించాడు. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్య ముక్కు కోశాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విక్రమ్, సీమాదేవి భార్యాభర్తలు. వీరికి పెళ్లై 12 ఏళ్లు అయ్యింది. వీరూ తమ ఇద్దరు పిల్లలతో మిథౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్స్తాలీ గ్రామంలో జీవిస్తున్నారు. కాగా, విక్రమ్ మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భార్య సీమాదేవికి తెలిసి ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఈ విషయంపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రోజు తాగొచ్చి ఆమెతో గొడవపడేవాడు. అలా ఈ నెల 1వ తేదీన తాగొచ్చి భార్య సీమాదేవితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో నాలుగేళ్ల కుమార్తె పై కూడా చేయి చేసుకున్నాడు.
ఇది చూసిన సీమ.. ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయిన భర్త, వంటగదిలో ఉన్న కత్తితో ఆమె ముక్కు కోశాడు. అనంతరం ఆ ముక్కును జేబులో వేసుకుని పారిపోయాడు. సీమాదేవి నొప్పితో కేకలు వేయడంతో, స్థానికులు గమనించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిక్సిత అందించారు. కోలుకున్న తర్వాత సీమాదేవి తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి జేబులో భార్య ముక్కుతో పరారైన విక్రమ్ కోసం గాలించి పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరు పరిచి పోలీసు కస్టడీకి తరలించారు.