ఈ మద్య కాలంలో దొంగలు మరీ బరితెగించిపోతున్నారు. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులను నమ్మకంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నడు దోచుకుంటున్నారు.
ఈ మద్య ఈజీ మనీ కోసం ఎలాంటి అక్రమాలకైనా తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలను కూడా దొంగలు వదలడం లేదు. కొంతమంది నమ్మకంగా ఉన్నవాళ్లు సమయం చూసుకొని నిండా ముంచిపోతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డిని ఆమె కారు డ్రైవర్ దారుణంగా మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు కోసం నమ్మిన వాళ్లనే దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డిని ఆమె కారు డ్రైవర్ నమ్మించి మోసం చేశాడు. ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల్లో డబ్బు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డి బంజారాహిల్స్ రోడ్డ నెం. 14 లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ లో నివస్తుంది. గత ఏడాది నుంచి చిన్నా అలియాస్ బీసన్న అనే వ్యక్తి శృతి రెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
బీసన్న ప్రతీ రోజు శృతి రెడ్డిని రక రకాల ప్రాంతాలకు, షాపింగ్ మాల్స్కు తీసుకు వెళ్తూ ఉండేవాడు. ఆమె తన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం బాగా గమనించాడు బీసన్న. ఈ క్రమంలోనే అతని కన్ను ఆమె క్రెడిట్ కార్డు మీద పడింది. ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డు చోరీ చేశాడు. శ్రీమహావీర్ జేమ్స్ అండ్ పెరల్స్ లో కార్డు స్వైప్ చేసి రూ.11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం డీకే శృతి రెడ్డికి ఆలస్యంగా తెలిసింది. వెంటనే డ్రైవర్ బీసన్నను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు, రక రకాల కట్టుకథలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆమె సిబ్బంది గట్టిగా అడగడంతో కార్డు తానే తీసుకున్నానని.. డబ్బులు వాడుకున్న విషయం ఒప్పుకున్నాడు. వెంటనే బీసన్నపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. బీసన్న పై ఐపీసీ సెక్షన్ 420, 408 ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.