పెళ్లి అనగా కొత్త పెళ్లి కూతురుపైనే శ్రద్ధంతా. ఇంటికి వచ్చే కోడలిపై ఎన్నో కలలుకంటారు అత్తమామలు. కొడుకు బాధ్యతలతో పాటు ఇతర బాధ్యతను అప్పగించేసి రామా, కృష్ణ అనుకుంటూ ఓ మూలన కూర్చుందామని అనుకుంటారు.
పెళ్లి అనగా కొత్త పెళ్లి కూతురుపైనే శ్రద్ధంతా. ఇంటికి వచ్చే కోడలిపై ఎన్నో కలలుకంటారు అత్తమామలు. కొడుకు బాధ్యతలతో పాటు ఇతర బాధ్యతను అప్పగించేసి రామా, కృష్ణ అనుకుంటూ ఓ మూలన కూర్చుందామని అనుకుంటారు. ఆమె చేతి వంట తింటూ.. కొడుకుకు పుట్టే బిడ్డలను ఆడించుకుంటూ ఇక అవసాన దశను వెళ్లదీసుకుందామని భావిస్తుంటారు. అందుకే కొడుకు లైఫ్లో సెటిల్ అవ్వగానే.. తమ ఇంటిలోకి అడుగుపెట్టే కోడలి కోసం వెతుకుతుంటారు. ఇక పెళ్లి చేశాక.. ఆ ముచ్చట.. ఈ ముచ్చట తీరాక.. కోడలికి అన్ని బాధ్యతలను అప్పగిద్దామని చూస్తారు. అలా అనుకుని ఇలా పెళ్లి చేశారో లేదో.. అలా అత్తాగారింటికి ఝలక్ ఇచ్చారు కోడళ్లు.
పెళ్లైన కొద్ది రోజులకే అత్త ఇంటికి కన్నం కొట్టారు ఆ ఇంటికోడళ్లు. ఈ విచిత్ర దొంగతనం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్పన్ కాలనీకి చెందిన భరత్ గుప్తా, అతనికి తమ్ముడయ్యే రోహిత్ గుప్తాలకు ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్కి చెందిన సంజన, అంజలిలతో ఈ నెల 11న ఒకే పందిట్లో పెళ్లి అయ్యింది. భరత్ గుప్తా అత్త కొడుకు బంటీగుప్తా, అతని స్నేహితుడు జీతూ ఈ పెళ్లిళ్లను కుదిర్చారు. సంజన, అంజలి అక్కా చెల్లెళ్లు. పెళ్లైన ఐదు రోజుల తర్వాత భరత్ బయట పని ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఇదే మంచి సమయం అనుకున్న నూతన వధువులు తమ పనిని చక్క బెట్టుకున్నారు.
ఇంట్లో బంగారం, రూ.2.5 లక్షల నగదులను మూట గట్టుకుని పరారయ్యారు సంజన, అంజలి. ఘటన జరిగిన సమయంలో భరత్ తల్లి, అక్క ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో వీరి అలికిడి లేకపోవడంతో భరత్ తల్లి వెతకగా.. ఇద్దరూ కనిపించకుండా పోయారు. వెంటనే కొడుక్కి సమాచారం అందించింది. భార్యకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో ఇంటిని శోధించగా. నగదు, బంగారం పోయినట్లు నిర్ధారణైంది. దీంతో గొల్లుమంటూ భరత్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన వధువులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.