ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా పాటిస్తున్నా డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మితిమీరిన వేగం వల్ల వారి ప్రాణాలే కాదు.. ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. బైక్ ను కారుతో ఢీ కొట్టడమే కాదు.. బాధితుడ్ని దాదాపు మూడు కిలోమీటర్ల మేర కారుతో ఈడ్డుకు వెళ్లాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సొషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బైక్ ను కారుతో ఢీ కొట్టిన డ్రైవర్ బాధితుడిని మూడు కిలోమీటర్ల వరకు కారుతో ఈడ్చకుంటూ వెళ్లాడు.. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాగపూర్ ఎయిర్ పోర్ట్ లో ఆగస్టు 17 రాత్రి ఓ కారు డ్రైవర్ అతి వేగంగా కారు నడుపుకుంటూ వచ్చి బైక్ ని బలంగా ఢీకొట్టాడు. బైక్ పై వెళ్తున్న రాకేష్ గేట్, అకాశ్ టేకం అనే ఇద్దరు ఎగిరి రోడ్డు అవతల పడిపోయారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కారు ముందు భాగంలో బైక్ చిక్కుకు పోయింది. కారు డ్రైవర్ కనీసం ఏమైందీ అన్ని కూడా చూడకుండా బైక్ ని దాదాపు 3 కిలో మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. బైక్ పై నుంచి పడిపోయిన ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరుచికిత్స పొందుతూ మరణించాడు. అదే రూట్ లో ప్రయాణిస్తున్న కొంతమంది వాహనదారులు ఈ ఘటనను కెమెరాల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
कार में फसी बाइक को कार चालक ने 3 किलोमीटर तक घसीटा वायरल वीडियो नागपुर का है.@NagpurPolice #nagpur pic.twitter.com/GaaEo2w1GX
— rajni singh (@imrajni_singh) August 18, 2023