ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముంచుకొస్తుందో తెలీదు. రెప్పపాటులో జరిగే కొన్ని ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. అలాంటి ఘటనే అక్కడ చోటుచేసుకుంది.
ప్రమాదాలు ఏ రూపంలో జరుగుతాయో ఊహించలేము. ఎక్కువగా నిర్లక్ష్యం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో కొందరు బాధితులు ప్రాణాలు కోల్పోయి, మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తుంటారు. ప్రమాదాల నివారణకు అధికారులు కఠినమైన నిబంధనలను అమలు చేసినప్పటికి వాహనదారులు వాటిని ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇదే క్రమంలో ఓ రాష్ట్రంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేస్తోంది. అజాగ్రత్తతో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఓ బైకర్, ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే?..
కర్ణాటకాలో చోటుచేసుకున్న కారు, బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాయచూర్ జిల్లాలో ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో వేగంగా దూసుకొచ్చిన కారు ఆ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. బైక్ కూడా రోడ్డుపై కొంత దూరంలో ఎగిరిపడింది. అదే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ కొందరు విద్యార్థినులు వెళ్తున్నారు. బైకును ఢీకొట్టిన కారు అదుపుతప్పి ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టింది. దీంతో వారు కొంత దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో బైకర్ కు తీవ్రగాయాలు కాగా, విద్యార్థినులు స్వల్పగాయాలతో బయటపడ్డట్టు తెలస్తోంది. అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఆ విద్యార్థినులకు సాయమందించారు. ఈ ప్రమాదం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A speeding #car hit two female students who were walking on the side of #Raghavendra Petrol Station Road in #Raichur.#kannadanews #CCTV #Accidente #raichur #cctv #Noida #viralvideo #BreakingNews pic.twitter.com/hdPPuGT0an
— Harish Deshmukh (@DeshmukhHarish9) July 26, 2023