ప్రస్తుతం నేటి సమాజంలో ఏది కావాలన్నా ఆన్ లైన్లో చూసుకోవడం.. ఆర్డర్ పెట్టేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇంకా ఆన్ లైన్ షాపింగ్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం.
ఇప్పుడు యువత ఎక్కువగా ఈ విధంగానే తమకు కావలసిన ఫుడ్ ని క్షణాల్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దీంతో ఫుడ్డెలివరీ సంస్థలకు రోజురోజుకూ ఆర్డర్ల సంఖ్య పెరిగిపోతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, ఫుడ్పాండా వంటి సంస్థల్లో మాత్రమే ఫుడ్లవర్స్ఆర్డర్లను పెట్టుకుంటారు. ఆ సంస్థలు కూడా కస్టమర్లకు నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లో అందిస్తున్నాయి. అయితే, వారి సంపాదన నెలకు వేలలో ఉంటుంది. అందుకని ప్రస్తుతం మనకు నచ్చిన ఫుడ్ కేవలం నివిషాలల్లో మన ముందు ఉంటుంది.
అయితే ఇప్పుడు ఫేమస్ గా జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరి సంస్థలు ఈ బిజినెస్ లో ఒక రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. అలా మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మన దగ్గరికి వచ్చే డెలివరి బాయ్స్ గురించి అందరికి తెలిసిందే. జొమాటోలో వేలాది మంది డెలివరి బాయ్స్ లో అందినంత ఉపాది ఇంకా వేరేవాళ్లు కూడా పొందలేకపోతున్నారు. ఇంకా ఇంటికి వచ్చి ఫుడ్ డెలీవరీ చేసే వాళ్లకి ఒక్కో ఆర్డర్ పై కొంత కమీషన్ అనేది వస్తుంది. అలా వాళ్లు రోజంతా కష్టపడుతూ నెల తిరిగే లోపే ఓక్కో జొమాటో డెలివరీ బాయ్ సగటున మెుత్తం రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఆ డెలీవరీ బాయ్ కష్టపడిన తీరును బట్టి వారి సంపాదన ఆదారపడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే అలాగే ఓ డెలీవరి బాయ్ గురించి మనం ప్రత్యేకంగాచర్చించుకోవాల్సిందే. అతను రోజు ఫుడ్ డెలవరీలు చేసుకుంటూ.. రోజుకు రూ.1 కోటి వరకు సంపాదిస్తున్నారట. అనే విషయం వింటూనే చాలా ఆశ్చర్యంగా ఉంది. కదా.. కానీ అది నిజమే.. అయితే ఈ విషయం పంజాబ్ లో చోటు చేసుకుంది.
దీపందర్ గోయల్ పంజాబ్ లోని ముక్త్ సర్ లో జిల్లాలో నివసిస్తున్నాడు. అతను అంతా ఎక్కువగా కూడా చదవలేదు. అప్పట్లోనే పాఠశాల స్థాయిలో అతను అంతగా రాణించలేదు. ఆ తర్వాత గోయల్ 8 వ తరగతి అయిపోయాక పూర్తిగా మారిపోయారు. తను చదువుతున్న స్కూల్ టాప్ ర్యాంకర్లలో ఒక్కడి గా నిలిచాడు. ఇంకా ఐఐటీ ప్రిపరేషన్ కోసం కుటుంబసభ్యులు గోయల్ ని చండీఘట్ పంపిచారు. కానీ అక్కడి విద్యార్థులతో పోటీ పడలేక మధ్యలోనే ఆపేసి ఇంటికి వచ్చేసాడు. అయినా మళ్లీ పట్టు వదలకుండా ఢీల్లీ ఐఐటీ లో సీటును సొంతం చేసుకున్నాడు. అలా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన దీపిందర్ ప్రస్తుతం జొమాటో సంస్థ 2021 లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. అలానే దీపిందర్ గోయల్ నికర సంపద విలువ 650 మిలియన్ డాలర్లు అంటే (రూ.5,345 కోట్లకు) చేరుకుంది. అయితే ప్రస్తుతం అతనికి కంపెనీలో 4.7 శాతం వాటా కూడా ఉంది. అలా ఆయన గోయల్ కంపెనీ నుంచి ఒక్క రూపాయి జీతం కూడ తీసుకోవడం లేదు. తనకు ఎంప్లాయిూ స్టాక్ ఓనర్ షిప్ ఫ్లాన్స్ ద్వారా రూ.358 కోట్లు చేతికొచ్చాయి. అయితే ఈ లెక్కన తనకు రూ.కోటి సంపాదించినట్లే కదా.. కనుక ప్రస్తుతం జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోరూ. 66,875 కోట్లుగా ఉంది. తను జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు చూసిన దీపిందర్ ప్రస్తుతం కోట్ల రూపాయల కంపెనీని స్ధాపించి మరింతా ముందుకు సాగుతుంది.