కరోనా వైరస్ కారణంగా మాస్కు తప్పనిసరి అయిపోయింది. ఇప్పటికే కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర మందులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ముందుగా మాస్క్లు ధరించడం తప్పని సరి అయ్యింది. మాస్కుల్లో కూడా రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్ -95, 3-ప్లై లేదా క్లాత్ మాస్క్ల కంటే ఇది బాగా పని చేస్తుంది. థింకర్ టెక్నాలజీస్ ఇండియా ( పూణే బేస్డ్ ) సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది.
3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర సంస్థగా ఏర్పాటైనథింకర్ టెక్నాలజీస్ ఇండియా కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్కుల తయారీపై పరిశోధనలను సాగించి వినూత్నంగా 3డి మాస్కులను అభివృద్ధిచేసింది. వైరస్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటం లో భాగంగా, సైన్స్ & టెక్నాలజీ విభాగం యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఎంపిక చేసిన తొలి ప్రాజెక్టులలో వైరుసిడల్ మాస్క్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ విషయాన్నీ థింక్ర్ టెక్నాలజీస్ వ్యవస్థాపక-డైరెక్టర్ షితాల్కుమార్ జాంబాద్ పేర్కొన్నారు.
దీని వలన మంచి ప్రొటెక్షన్ వస్తుంది అని కూడా అంటున్నారు. ఈ వైరుసిడల్ మాస్క్లు బ్యాక్టీరియా ఫిల్టరేషన్ ని 95 శాతం కంటే ఎక్కువగా కలిగి ఉన్నాయని మొట్టమొదటి సారిగా 3 డి-ప్రింటెడ్ మాస్క్ కవర్ల కోసం మల్టీలేయర్ క్లాత్ ఫిల్టర్లను తయారు చేయడానికి కంపెనీ 3డి ప్రింటర్లను ఉపయోగించింది. మాస్కుల తయారీపై 2020 జులై 8న థింకర్ టెక్నాలజీస్ ఇండియా ఒప్పందంపై సంతకం చేసింది.