దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. మోసపూరిత ఎస్ఎంఎస్లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. కొంత మంది మోసగాళ్లు ఎస్బీఐ పేరుతో కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపడం బ్యాంక్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ మొబైల్ నెంబర్లతో బ్యాంక్కు ఎలాంటి సంబంధం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్లలో ఉండే లింక్స్పై క్లిక్ చేయవద్దని ఎస్బీఐ తన కస్టమర్లను కోరింది.
ఎస్బీఐకి దేశం మొత్తం మీద 24 వేలకు పైగా బ్రాంచులు ఉండగా, 42 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కార్యకలాపాలు జరుగుతుంటాయి. పేదవారి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పైస్థాయి అధికారులు వరకు అందరకి ఎస్బీఐలో అకౌంట్ లు ఉన్తయి. ఈ అవకాశాన్ని ఆసరాగా మలుచుకొని అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. కొంత మంది సైబర్ మోసగాళ్లు ఎస్బీఐ పేరుతో కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపడం బ్యాంక్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. “8294710946, 7362951973” అనే ఈ రెండు నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ కోరింది. ఈ నెంబర్లతో బ్యాంక్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అందువల్ల స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఈ నెంబర్ల నుంచి ఏమైనా మెసేజ్లు వస్తే మాత్రం అలర్ట్గా ఉండాలి. మెసేజ్లలో ఉండే లింక్స్పై క్లిక్ చేయవద్దని కస్టమర్లను హెచ్చరించింది.
Do not engage with these numbers, & don’t click on #phishing links for KYC updates as they aren’t associated with SBI. #BeAlert & #SafeWithSBI https://t.co/47tG8l03aH
— State Bank of India (@TheOfficialSBI) April 20, 2022
ఇది కూడా చదవండి: ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!
టెలి కాలర్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆకర్షించే ఆఫర్లు వస్తే వాటిని నమ్మవద్దని ఎస్బీఐ తన కస్టమర్లను కోరింది. అలాగే, కేవైసీ అప్డేట్ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మీ పాస్వర్డ్,కార్డు డీటెయిల్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ లాగ్ ఇన్ డీటెయిల్స్ లాంటివి ఎవ్వరికీ చెప్పొద్దని, సీక్రెట్గా ఉంచాలని పేర్కొంది. ఏదైనా సమస్య వస్తే.. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. సైబర్ నేరస్థుల చేతిలో మోసపోతే వెంటనే ఆ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయాలని కోరింది.