అతడు బ్యాంక్ మేనేజర్. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగమే తన పాలిట శాపమైంది. ఆ కారణంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అంత తీవ్రమైన పోటీని తట్టుకుని ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించాడు ఓ వ్యక్తి. ఆఖరికి ఆ ఉద్యోగం వల్లనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్యా పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చాడు. మేనేజర్ స్థాయి ఉద్యోగి అలా చేయడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణలో చోటేచేసుకుంది. అసలు ఆ ఉద్యోగి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. తను ఎదుర్కొన్న ఆ పరిస్థితి ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు బానోతు సురేష్. కాగా బ్యాంక్ లో పనిభారం ఎక్కువై ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీఐ లో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న బానోతో సురేష్ అనే వ్యక్తి బ్యాంక్ లో పనిభారం ఎక్కువగా ఉందని, ఇద్దురు చేసే పనని తానొక్కడినే చేస్తున్నానని భార్యతో, మిత్రులతో తన ఆవేధనను వెల్లడించాడు.
తన సమస్యకు పరిష్కారం దొరకదేమోనని మానసిక ఆందోళనకు గురైన మేనేజర్ ఆఫీస్ లోనే క్రిమిసంహారక మందు తాగాడు. ఇది గమనించిన బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. పనిభారం ఎక్కువగా ఉండడంతోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. బ్యాంక్ మేనేజర్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.