భారత దేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకరు ముకేష్ అంబానీ. తండ్రి దీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా అభించిన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ.. అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ముకేష్ అంబాని. అదృష్టం ఆయన వెంటే ఉన్నట్టు.. ముఖేష్ అంబాని ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా ఎంతో సక్సెస్ సాధిస్తూ పట్టిందల్లా బంగారమే అన్న విధంగా వ్యాపార రంగంలతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇప్పుడు భారత దేశంలో అపర కుభేరుడుగానే కాదు.. ప్రపంచ కుభేరుల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఆయన మరో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.
భారత్ లో ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ ఎన్నో వ్యాపార రంగంలో తన సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల రిలయన్స్ రిటేల్ రంగంలోకి అడుగు పెట్టిన ఆయన ఇప్పుడు సెలూన్ బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ చెన్నైకి చెందిన నేచురల్ కేంద్రం నిర్వహిస్తున్న గ్రూమ్ ఇండియా సెలూన్ అండ్ స్పాలో 49% వాటాతో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏకంగా 49 శాతం వాటాను దక్కించుకునే ప్రయత్నం చేయడంతో హిందూస్థాన్ యూని లివర్ కు చెందిన పలు బ్రాండ్లకు పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు వందలకు పైగా పేరు మోసిన స్పా- సెలూన్ అవుట్ లెట్స్ ఉన్నాయి. అయితే వీటిని మరింతగా పెంచేందుకు రిలయన్స్ ఆలోచనలో ఉన్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ తెలిపారు. రిలయన్స్ తో ఒప్పందం తర్వాత ప్రమోటర్లు పాతవారే ఉంటారని.. నెట్ వర్క్ ను విస్తరించేందుకు రిలయన్స్ నిధులు సమకూర్చుతుందని అన్నారు. ఇక దేశంలో ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో.. పలు వ్యాపార సంస్థలు భారీగా నష్టాలకు గురయ్యాయి.. వాటిలో సెలూన్ అండ్ స్పా రంగాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకు వెల్లినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ తో చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని సెలూన్ అండ్ స్పా సీఈఒ కుమరవేల్ సీకే తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ముకేష్ అంబాని రిలయన్స్ రిటైల్ బాధ్యతలను తన కూతురు ఇషా అంబానికి అప్పజెప్పిన విషయం తెలిసిందే.