దసరా పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇంట్లో పిల్లల సందడి.. పిండి వంటల వాసనలు.. ఇంతటి ఆనంద సమయంలో.. సామన్యులకి శుభవార్త చెప్పాయి ఆయిల్ కంపెనీలు. పండగలు అంటేనే భారీగా నూనె వాడకం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పండగ ముందు సామన్యూలకు భారీ ఊరటనిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇతర వంట నూనెలతో పోలిస్తే.. పామాయిల్ నూనె ధరలను భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా రేట్లు తగ్గటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పామాయిల్.. పండగ సీజన్ లో ఎక్కువగా ఉపయోగించేది. సామాన్యూలు పండగలకు పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయం. ఇది అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే.. పామాయిల్ ధరలు కనిష్ఠ స్థాయిలో దిగొచ్చాయి. దీంతో భారత ప్రభుత్వం రికార్డు స్థాయిలో దిగుమతులు చేపడుతోంది. భవిష్యత్తులో ఎలాంటి కొరతలు ఏర్పడకుండా ముందే జగ్రత్త పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మంద్యం భయంతోనే రేట్లు దిగొచ్చాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ తగ్గింపు ధరలను వినియోగదారులకు వెంటనే బదలాయిస్తామని కంపెనీలు తెలిపాయి. అయితే పామాయిల్ ధరలు తగ్గినప్పటికీ .. వాటితో తయారుచేసే ఇతర వస్తువుల రేట్లు తగ్గక పోవడంతో FMGC కంపెనీలు ధరల తగ్గించడానికి ఆసక్తి చూపడం లేదు.
అయితే పామాయిల్ తో పాటు ఇతర ఆయిల్స్ అయిన సన్ ఫ్లవర్, సోయాబీన్ ధరలు కూడా దాదాపు సగానికి సగం దిగొచ్చాయి. గత నెల రోజులుగా పామాయిల్ ధరలు దిగొస్తూనే ఉన్నాయి. ఈ తగ్గిన ధరలను వినియోగదారులకు బదలాయిస్తామని జెమిని ఎడిబుల్స్ అండ్ ఈట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి వెల్లడించారు. ఇక జూలై నెల కంటే పామాయిల్ దిగుమతుల శాతం ఆగస్టులో 87 శాతం పెరిగింది. గడిచిన 11 నెలల్లో ఇదే గరిష్ట స్థాయి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారతదేశ జనాభా ఎక్కువ కాబట్టి వారికి సరిపడా ఆయిల్ కావాలంటే తప్పనిసరిగా దిగుమతులపై ఆధారపడవలసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా తగ్గిన ధరలకు అనుగుణంగా.. దిగుమతులను పెంచుకుంటోంది. పండగ సీజన్ ఈ ధరల తగ్గింపు సామన్యూలకు భారీ ఊరటనే కలిగించిదనే చెప్పాలి. తగ్గిన ధరలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.