ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు బాగా చదివి మంచి ఉన్నస్థితిలో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రేయిబవళ్లు కష్టబడి వారిని చదివిస్తారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకూడదనే ఆలోచనలో కొందరు పిల్లలు కష్టపడి చదివి.. భారీ జీతం ఉద్యోగం సంపాదిస్తారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పట్టలేని సంతోషం ఉండిపోతారు. ఇక తమ కొడుకు ఉన్నత స్థితికి వెళ్లి మంచి పేరు తెస్తాడిని ఆలోచనలో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మన ఆశలో ఆవిరి చేస్తూ తిరిగి రాని లోకానికి వెళ్లిపోతారు. 22 ఏళ్లేకే నెలకు రూ.4.83 లక్షల జీతం వచ్చే ఉద్యోం సాధించిన యువకుడు కుటుంబాని వదలి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లో నివాసం ఉంటున్న TSMSIDC ఏండీ కట్టా చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు అభిజిత్. అతడిపై వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గటే అభిజికత్ రెడ్డి బాగా కష్టబడి బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తైన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. 22 ఏళ్లకే నెలకు రూ.4.83 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని అభిజిత్ సాధించాడు. సౌది అరేబియా ప్రభుత్వ కంపెనీ సౌదీ అరామ్ కోలో కెమికల్ ఇంజనీర్ డిపార్ట్ మెంట్ లో అభిజిత్ కు జాబ్ వచ్చింది. అతడికి మంచి ఉద్యోగం రావడంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులేవు. కొన్ని రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ-20 మ్యాచ్ చూసి పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటంబంలో ఒక్కసారిగా విషాధఛాయలు అలుముకున్నాయి.